
ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ లేఖలో కోరారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోదీని కోరారు. కోవ్యాక్సిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. కోవ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, యన్ఐవీలు కలిసి కృషి చేశాయని అన్నారు.