HomeతెలంగాణV Hanumantha Rao: మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ...

V Hanumantha Rao: మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ మీకు అర్థమైత లేదు..

V Hanumantha Rao: పెట్రోల్ పెరిగింది. డీజిల్ ధర కూడా పెరిగింది. నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. యుద్ధం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ధరలు పెంచడం వల్ల సామాన్యుల జీవితం మీద తీవ్రమైన ఇబ్బంది పడుతోందని.. ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మొత్తం కలిపి మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటే.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడే మాటలు మరో విధంగా ఉన్నాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.

మన దేశంలో ఉపయోగించే క్రూడ్ ఆయిల్ అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ నుంచి మొదలుపెడితే.. అత్యంత ఖరీదైన బంగారం వరకు అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం. కేవలం ఇవి మాత్రమే.. చాలామంది సరదాగా తినే పాన్ లో ఉపయోగించే ముడి సరుకులు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అయితే యుద్ధం వల్ల పాన్ తయారీలో ఉపయోగించే ముడి సరుకులు ధర కూడా విపరీతంగా పెరిగింది. దీనిపై వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.”పెట్రోల్ ధరలు పెంచినవ్. డీజిల్ ధర కూడా పెంచినవ్.. అన్ని రేట్లు అడ్డగోలుగా పెంచినవ్. ఏం చేస్తున్నవో అర్థం కావడం లేదు. చివరికి పాన్ లో వాడే వస్తువులను కూడా వదిలిపెట్టవ. పాన్ తినే వాళ్ళ పరిస్థితి ఏంది. ఇంత ధరలు పెంచితే ఎట్ల తింటరు..మోడీ నీకు ఇది న్యాయం కాదు” అని హనుమంతరావు విమర్శించారు.

వాస్తవానికి ఈ కోణంలో ఏ కాంగ్రెస్ నాయకుడు.. ఏ బిఆర్ఎస్ నాయకుడు ఆలోచించలేదు. ఎంతసేపటికి పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ చాలామంది పాన్ తినేవాళ్లు.. ధరలు పెరగడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే వారి తరఫున వి హనుమంతరావు వకల్తా పుచ్చుకున్నారు. మోడీ ధరలు తగ్గించు అంటూ డిమాండ్ చేశారు. హనుమంతరావు డిమాండ్ తో మోడీ తలవంచుతారా.. ధరలు తగ్గిస్తారా.. ఒకవేళ ధరలు తగ్గిస్తే మాత్రం హనుమంతరావు రేంజ్ తెలంగాణలో అమాంతం పెరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version