
జేఈఈ (మెయిన్) నాలుగో విడత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఆగస్టు 26, 27, 31 సెప్టెంబర్ 1,2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జేఈఈ మెయిన్ నాలుగో సెషన్ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.