టీమ్ ఇండియా టెయిలెండర్లు షమి(34), బుమ్రా (23) నిలకడగా ఆడుతూ ఎనిమిదో వికెట్ కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దాంతో కష్టాల్లో ఉన్న జట్టును గట్టేక్కించారు. ఈ క్రమంలో 102 ఓవర్లకు భారత్ స్కోర్ 259/8 గా నమోదైంది. టీమ్ ఇండియా పేసర్ బుమ్రా బ్యాటింగ్ సగటు అన్యూహ్యంగా పెరిగింది. ఈ సిరీస్ ఆడిన మూడు ఇన్నింగ్స్ లోనే 21.50 కు అమాంతం పెరిగింది.