ఇంగ్లాండ్ సిరీసులో రవించంద్రన్ అశ్విన్ ఆడాల్సిన సమయం వచ్చేసిందని టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఆంగ్లేయులను తన స్పిన్ తోనే కాకుండా మానసికంగానూ అతడు దెబ్బతీయగలడని పేర్కొన్నారు. అందులోనూ ఎడమచేతివాటం ఆటగాళ్లను యాష్ సులువుగా బుట్టలో పడేస్తాడని వెల్లడించాడు. నాలుగో టెస్టుకు ముందు అతడు డైలీ టెలిగ్రాఫ్ కు ఓ కథనం రాశాడు. ఆశ్విన్ ఆడేందుకు సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్ లోని ఫాట్ పిచ్ ల్లో ఓవల్ ఒకటి. ఎప్పట్లాగే ఈ సీజన్లోనూ వికెట్లో పెద్ద మార్పులేమీ లేవు. అశ్విన్ బౌలింగ్ లో వైవిధ్యం ఓవల్ మైదనంలో సాయపడుతుందని అతడు అంచనా వేశాడు.