
కృష్ణపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందును అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కంటి మందును అనుమతి ఇస్తారా అని కోర్టు ప్రశ్నించగా అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేందుకు 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.