
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు చేరాయి. ఇందులో 2,56,92,342 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 20,26,092 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2,38,022 మంది వైరస్ బయటపడగా, కొత్తగా 3128 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 9.160 శాతానికి పెరగగా, పాజిటివిటీ రేటు 9.04 శాతానికి తగ్గిందని తెలిపింది.