శ్రీలంక ప్రీమియర్ లీగ్ టీ 20 మరోసారి వాయిదా పడింది. శ్రీలంక దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రస్తుతం ఈ టోర్నీ జరపలేమని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.ఈనెల 27 నుంచి టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 23 మ్యాచ్లను ఒకే వేదికలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్కు ఏర్పాటు చేశారు. ఈ లీగ్లో గేల్, డుప్లెసిన్, షాహిద్ ఆప్రిది, బ్రాత్వైట్ వంటి వారు ఆడనున్నారు. అయితే సెకండ్ వేవ్ కరోనా విజృంభించడంతో తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉన్నదని, అందువల్ల వాయిదా వేస్తున్నామని క్రికెట్ బోర్డు తెలిపింది. ఇలా వాయిదా పడడం ఇది మూడోసారి