లోకేశ్ పై వైసీపీ నేతల బూతు పురాణం…

ఆంధ్రప్రదేశ్లో ప్రజా పాలన ఏ విధంగా ఉన్నా రాజకీయ వేడి మాత్రం ఎప్పటికీ చల్లారదని తెలుస్తోంది. ఇక్కడి నేతల మధ్య నిత్యం వాదోపవాదనలే ప్రధానంగా నిలుస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చేసిన ఓ వ్యాఖ్యతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి లోకేశ పై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా మండలిలో […]

Written By: NARESH, Updated On : June 21, 2021 8:39 am
Follow us on

ఆంధ్రప్రదేశ్లో ప్రజా పాలన ఏ విధంగా ఉన్నా రాజకీయ వేడి మాత్రం ఎప్పటికీ చల్లారదని తెలుస్తోంది. ఇక్కడి నేతల మధ్య నిత్యం వాదోపవాదనలే ప్రధానంగా నిలుస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చేసిన ఓ వ్యాఖ్యతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి లోకేశ పై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా మండలిలో ‘చూసుకుంటాం..’ అని ఓ కీలక మంత్రి కూడా వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేత నారా లోకేశ్ ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆయన ‘వైసీపీ కుక్క’ నే పదం వాడారు. అయితే రెండు రోజుల వరకు వైసీపీ నాయకులెవరూ స్పందించలేదు. ఆ తరువాత ఒక్కసారిగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే వారు మాట్లాడేవి విమర్శలు అని కాకుండా తిట్ల దండకం లాగా ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వినలేని విధంగా బూతులు వాడారు. ఇక మంత్రి పదవిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అడ్డూ అదుపు లేకుండా బూతులు వాడారు.

ఇక వీరి తిట్లకు టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయతే వారు ఇంతటి ఘాటు పదాలు వాడకపోవడంతో వారు ప్రచారంలోకి రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బండ బూతులతో పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి లోకేశ్ ఆ పదం అన్నది ఎవరినో గానీ జగన్ నే అన్నారని కొందరు ఆయనను ఉద్దేశించి లోకేశ్ పై విరుచుకుపడుతున్నారు. ఇక కొందరు వైసీపీ నేతలు తిట్లతోనే ఆగిపోకుండా మండలిలో చూసుకుంటాం.. అని అంటున్నారు. అంటే మండలిలో లోకేశ్ ను కొడతారా..? అని కొందరు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు