భారత దేశం ప్రపంచానికి అందించిన అనేక అద్భుతాలలో యోగా ఒకటి అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాపట్టణంలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ యోగా మన ప్రాచీన సంస్కృతిలో భాగమని ప్రపంచానికి మనమందించిన గొప్ప వరం అని అన్నారు. అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు ఒక దివ్య ఔషధం అని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.