లాక్ డౌన్ వేళ భార్యాభర్తలు ఇదే పనిచేశారన్నట్టు?

లాక్‌డౌన్‌ కారణంగా ఏడాది కాలం పాటు భార్యాభర్తలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనికితోడు ఆఫీసులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పుడు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నడిపిస్తున్నాయి. అయితే.. వీటి కారణంగా చాలావరకు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటారా..? దేశంలో గతేడాది మహిళలపై గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగాయని జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక పేర్కొంది.లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతోనే ఈ ఫిర్యాదులు […]

Written By: Srinivas, Updated On : March 27, 2021 3:45 pm
Follow us on


లాక్‌డౌన్‌ కారణంగా ఏడాది కాలం పాటు భార్యాభర్తలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనికితోడు ఆఫీసులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పుడు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నడిపిస్తున్నాయి. అయితే.. వీటి కారణంగా చాలావరకు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటారా..? దేశంలో గతేడాది మహిళలపై గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగాయని జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక పేర్కొంది.లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతోనే ఈ ఫిర్యాదులు పెరిగినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఇదే తీరు కొనసాగవచ్చని ఎన్‌సీడబ్ల్యూ వెల్లడించింది.

మహిళలకు నేరాలకు సంబంధించి 2019లో మొత్తం 19,730 ఫిర్యాదులు రాగా.. 2020లో ఆ సంఖ్య 23,722కు చేరింది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఎన్‌సీడబ్ల్యూకు ప్రతినెలా 2 వేలకు పైగా మహిళలకు వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 25 శాతం గృహహింస కేసులే ఉన్నారు. ఈ ఏడాదిలో జనవరి నుంచి మార్చి 25 వరకు 1463 గృహ హింస కేసులే వచ్చాయి.

లాక్‌డౌన్‌లో ఫిర్యాదుల సంఖ్య పెరగడంతో ఎన్‌సీడబ్ల్యూ ఓ వాట్సాప్‌ నంబర్‌‌ను ప్రారంభించింది. గతేడాది మార్చిలో కరోనాను అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అమలు చేశాయి. దీంతో చాలా మందిలో ఆర్థికంగా అభద్రతాభావం, ఒత్తిడి పెరగడం, ఆర్థిక పరమైన ఆందోళన వంటి అంశాలు గృహహింసకు దారి తీసినట్లు ఎన్‌సీడబ్ల్యూ చైర్‌‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్‌లో భార్యాభర్తలతోపాటు పిల్లలకు ఇల్లే పనిప్రదేశంగా మారింది. దీంతో మహిళలకు తమ ప్రొఫెషనల్‌ కెరీర్‌‌తోపాటు, ఇంటిపని బాధ్యతలు కూడా మీద పడ్డాయి’ అని రేఖా తెలిపారు.

మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మాట్లాడుతూ.. ‘గతంలో మహిళలు వారి మనోవేదనను అణచివేసుకునే వారు. ప్రస్తుతం మహిళల్లో అవగాహన పెరగడం వల్లే. ఫిర్యాదుల రేటు కూడా పెరిగిందని’ అభిప్రాయపడ్డారు.