Homeఆంధ్రప్రదేశ్‌JanaSena: జనసేనలో అయినా విజయం వరించేనా?

JanaSena: జనసేనలో అయినా విజయం వరించేనా?

JanaSena: రాజకీయాల్లో అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఉంటారు. ఇందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఉదాహరణ. అన్న కోసం వదల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ గెలిచిన తర్వాత అన్న చెల్లిని దూరం పెట్టారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు చేయాలని వర్చారు. 3 వేల కిలోమీటర్లు నడిచారు. కానీ, చివరకు పొత్తులు చిత్తయ్యాయి. సొంతంగా పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. అచ్చ ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్‌లని ఆళ్లగడ్డకు చెందిన ‘ఇరిగిల’ ఫ్యామిలీ రాజకీయం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. గెలుపు తలుపు తట్టలేకపోతున్నారు.

40 ఏళ్లుగా రాజకీయాలు..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఇరిగల ఫ్యామిలీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండడంతో ఇరిగల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్‌ నుంచిపోటీ చేసి ఓడిపోయారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు పలికారు. భూమానాగిరెడ్డి 2008 తెలుగు దేశం నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దీంతో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కూడా ఇచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లోనూ పుల్లారెడ్డికి ఓటమే ఎదురైంది. ప్రజారాజ్యం నుంచిపోటీ చేసిన భూమా కుటుంబం గెలిసింది. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయినా ఓడిపోయారు.

టీడీపీలోకి భూమా ఫ్యామిలీ..
ఆ తర్వాత జరిగిన రాజకీయా పరిణామాలతో భూమా ఫ్యామిలీ టీడీపీలో చేరింది. దీంతో ఇరిగిల కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి గంగుల విజయేందర్‌రెడ్డి విజయానికి కృషి చేశారు.

తాజాగా జనసేనలోకి ఇరిగెల ఫ్యామిలీ..
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసినా.. ఇరిగెల ఫ్యామిలీని విజయం వరించలేదు. దీంతో ఈసారి ఇరిగెల సోదరులు జనసేన నుంచి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఆళ్లగడ్డలో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో ఈసారి గెలుపు వరిస్తుందని హైదరాబాద్‌లో మంగళవారం పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఇరిగల రాంపుల్లారెడ్డితోపాటు ఆయన సోదరులు రాంచద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి జనసేనలో చేరారు. మరి ఈసారైనా వారిని విజయం వరిస్తుందో లేదో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version