Homeజాతీయ వార్తలుVande Bharat Express: వందే భారత్ ఇంజన్లలో ఎందుకీ నాణ్యతా లోపం?

Vande Bharat Express: వందే భారత్ ఇంజన్లలో ఎందుకీ నాణ్యతా లోపం?

Vande Bharat Express: అసలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఇంజిన్ ఎక్కడ ఉంది ? వందే భారత్ ఎక్స్ ప్రెస్ కి ఇంజిన్ అంటూ ఏదీ ఉండదు!వందే భారత్ ఎక్స్ప్రెస్స్ లో ఉండే అన్ని కోచ్ లు కూడా సెల్ఫ్ ప్రొపెల్లేడ్. ప్రతీ కోచ్ లేదా బోగీ కి ఎలెక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ముందు వైపు వెనుక వైపు ఉండేది కేవలం ఇన్ స్ట్రు మెంట్ పానెల్స్, కంట్రోల్స్ మాత్రమే ! లోకో పైలట్ లు ట్రైన్ ని నడపడానికి వాడే చిన్న కాబిన్స్ అవి. 2030 కల్లా మొత్తం ప్రయాణికుల రైళ్లు వందే భారత్ తరహాలో సెల్ఫ్ ప్రొపెల్లేడ్ బోగీలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వే లో ఉన్న డీజిల్-ఎలెక్ట్రిక్ ఇంజిన్లు [హైబ్రిడ్ ] మాత్రమే. 2025 కల్ల డీజిల్ ఇంజిన్ల ని పూర్తిగా తీసేవేసి వాటి స్థానంలో ఎలెక్ట్రిక్ ఇంజిన్ల ని ప్రవేశ పెడతారు. అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్స్ 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటున్నాయి అంటే ప్రతీ బోగీ కి ఎలెక్ట్రిక్ మోటార్లు ఉండడం వలనే ! ముందు భాగం దెబ్బతిని ఇంజిన్ కూడా బయటపడ్డది అంటూ ట్రోల్ చేయడం వాళ్ళ జ్ఞానానికి నిదర్శనం. ఇక ఎలక్ట్రిక్ మోటార్లు ప్రతీ బోగీ కింద ఉంటాయి !

Vande Bharat Express
Vande Bharat Express

మెయింటనెన్స్ కోసం ముందు వైపు పానెల్స్ ఓపెన్, క్లోజ్ సిస్టమ్ ని కలిగి ఉంటాయి. కార్లు, ఎస్ యూ వీ లకి ముందు భాగంలో బంపర్లు లేదా బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్ లు బిగిస్తారు. ప్రత్యేకంగా ఈ బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్ లు ఎందుకు విడిగా కొని బిగిస్తున్నారు ? ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కారు లేదా ఎస్ యూ వీలో ఉన్న మనుషులకి ఏమీ కాకుండా ఉండడానికా? లేకపోతే కారు దెబ్బ తినకుండా ఉండడానికా ?

Also Read: Garikapati- Bhavani Ravikumar: గరికపాటిని పద్ధతిగా చిరంజీవికి సారీ చెప్పు మన్న మెగా అభిమాన సంఘం అధ్యక్షుడు.. ఫోన్ కాల్ వీడియో వైరల్

నిజానికి మనం అనుకున్నట్లు ఈ గార్డ్ లేదా బంపర్ ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు , ఉండదు !పదేళ్లుగా అన్ని కార్లకి, ఎస్ యూ వీ లకి ముందు వైపు, వెనుక వైపు ఎయిర్ బాగ్స్ ఉంటున్నాయి. ధర కూడా తక్కువగా ఉంటుందని అసలు ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ఉన్నవి కూడా కొనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతీ కారుకి తప్పని సరిగా ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నిబంధన అమలులోకి తెచ్చారు.
మళ్ళీ కార్ల ముందు ఉండే బంపర్ ల విషయానికి వద్దామ్!

కార్లు లేదా ఎస్ యూ వీ ల ముందు భాగంలో బుల్ గార్డ్ లేదా బంపర్ లు బిగించడం చట్ట రీత్యా నేరం.
కార్లు లేదా ఎస్ యూ వీ ల ముందు భాగంలో బుల్ గార్డ్ లేదా బంపర్ లు బిగించడం మీద కేంద్రం గతంలో నిషేధం విధించింది.

-బుల్ గార్డ్ లేదా బంపర్ లని ఎందుకు నిషేధించాల్సి వచ్చింది ?

ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రభావం రక్షణ కోసం బిగించిన బంపర్ లేదా బుల్ గార్డ్ మీదే పడుతుంది.
దీని వల్ల కారు లేదా ఎస్ యూ వీ ముందు భాగంలో ఉండే ఎలక్ట్రానిక్ సెన్సార్లు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తాయి. ఎందుకంటే ఒత్తిడి బుల్ గార్డ్ మీద పడుతుంది కాబట్టి. దాంతో ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ సీటులో కూర్చున్న వారితో పాటు పక్కనే కూర్చున్న వారి ముందు ఉండే ఎయిర్ బాగ్స్ ఆలస్యంగా తెరుచుకుంటాయి కాబట్టి. అప్పటికే యాక్సిడెంట్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటాయి.
అందుకనే కార్ల ముందు భాగంలో ఎలాంటి బంపర్ లేదా గార్డ్ లని బిగించవద్దు అనే నిషేధించారు. ఈ విషయాన్ని లాబరేటరీ లో క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత బంపర్ ల వల్ల ప్రాణాలు పోతున్నాయి అని నిర్ధారించారు.

ఈ బంపర్ ల వల్ల మరో నష్టం కూడా జరుగుతుంది. బంపర్ లు నేరుగా కారు చాసిస్ లకి బిగిస్తారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఇంపాక్ట్ [వత్తిడి ] బంపర్ ద్వారా నేరుగా చాసిస్ మీద పడి కారు ఎందుకూ పనికిరాకుండా పోతుంది.

అదే బంపర్ లేకుండా ఉంటే ? యాక్సిడెంట్ వల్ల కలిగే ఇంపాక్ట్ కారు మీద సమానంగా పడుతుంది. ఎయిర్ బాగ్స్ సకాలం లో తెరుచుకొని ప్రాణ హాని లేకుండా ఉంటుంది. అలాగే కారు ముందు భాగం మాత్రమే దెబ్బతింటుంది కానీ పూర్తిగా పనికిరాకుండా పోదు.

ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకి ఇన్స్యూరెన్స్ రావాలి అంటే ఆ కారుకి బంపర్ లేదా బుల్ గార్డ్ లు ఉండకూడదు. బుల్ గార్డ్ లేదా బంపర్ లు ఉంటే ఏ ఇన్స్యూరెన్స్ కంపనీ కూడా మీకు నష్టపరిహారం చెల్లించదు.
ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకి బంపర్ కానీ గార్డ్ కానీ లేకుండా ఉంటే జంతువులు లేదా మనుషులకి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి. అదే బంపర్ లేదా గార్డ్ ఉన్నట్లయితే అవి ఐరన్ తో చేసినవి ఉంటాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ మనుషులమీద లేదా జంతువుల మీద తీవ్రంగా ఉంటుంది.

ఇప్పుడు రైళ్లల్లో ఎలా మార్పులు చేశారంటే

గతంలో రైలు ఇంజిన్ కి ముందు కౌ కాచర్స్ అని ఉండేవి. రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఇనుప జాలీ లాంటిది ఇంజిన్ ముందు భాగంలో ఉంటుంది. వీటిని కౌ కాచర్స్ అని అంటారు. ఈ కౌ కాచర్స్ ఆవులు కానీ గేదెలు కానీ ఇతర జంతువులు అడ్డువచ్చినప్పుడు వాటికి పెద్దగా హాని కలగకుండా చేయడానికి ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని ఇంజిన్లకు ముందు భాగంలో కౌ కాచర్స్ ఉంటాయి కానీ ఎక్కువగా ఏ మార్గంలో తరుచూ జంతువులు రైళ్లకి అడ్డంగా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయో ఆ రూట్ లలోనే కౌ కాచర్స్ ఉన్న ఇంజిన్లని ఉపయోగిస్తుంది భారతీయ రైల్వే. అయితే ఆయా జంతువులు గాయపడతాయా లేక మరణి స్తాయా అన్నది రైలు వేగాన్ని బట్టి అలాగే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కో సారి అది ప్రయాణీకుల రైలు అయినట్లయితే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం వల్ల బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉంది అని లోకో పైలట్ భావిస్తే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడు. లోకో పైలట్ కి తాను నడుపుతున్న రైలు దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల భద్రత మొదటి ధర్మంగా భావిస్తాడు. అంతే కానీ ఆవులు, గేదెల ప్రాణాలు కాదు.

ఇక వందే భారత్ రైలు విషయానికి వద్దామ్ ! వందే భారత్ రైలు ప్రయాణీకులని తీసుకెళ్తుంది అని మనకి తెలిసిందే ! కాబట్టి గేదెలు అడ్డువచ్చిన సమయంలో ఆ ట్రైన్ ఎంత వేగంతో ఉందో తెలియదు కానీ బ్రేకులు వేశాడు లోకో పైలట్.

ఇప్పుడు టీవి చానెల్ లో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఇంజిన్ ముందు భాగం అలా అయిపోయింది ఏమిటీ ? అది స్కూటీనా ? లేక ట్రైన్ ఇంజినా ? ఇలా జోకులు వేస్తున్నారు కానీ వారికి తెలియంది ఏమిటంటే ఒక ప్రత్యేకమయిన మెటీరీయల్ తో తయారుచేసిన ముందు భాగం జంతువులకి తగలాగానే వేటికవే విడిపోయే విధంగా అమర్చారు అని. వందే భారత్ డిజైన్ కౌ కాచర్స్ కోసం కూడా చేశారు. దానిలో భాగంగానే ముందు భాగం లైట్ మెటీరీయల్ తో తయారుచేసి అమర్చారు.

రైల్వే సేఫ్టీ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు నిరంతరం పరిశోధన చేస్తూనే ఉంటారు భద్రత కోసం. వందే భారత్ కోచ్ ల రూపకల్పన విషయం చాలా విషయాలు ఆలోచించే డిజైన్ చేశారు. పాత ఇంజిన్ల ముందు ఉండే కౌ కాచర్స్ ఈ ట్రైన్ కి వాడితే అందం పోతుంది కానీ అదే సమయంలో కౌ కాచర్ కి బదులుగా లైట్ మెటీరీయల్ ని వాడారు. ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ ముందు భాగం మాత్రమే దెబ్బతిన్నది కానీ ఎక్కడా రక్తపు మరకలు లేవు. మనం ట్రైన్ ఎక్కగానే కాసేపటికి నిద్ర పోవాలని అనిపిస్తుంది ఎందుకో తెలుసా ? రైలు పట్టాల మధ్య ఉండే గ్యాప్ వల్ల బోగీ చక్రాలు ‘టకా టక్ ‘ శబ్దం చేస్తాయి మీరు వినే ఉంటారు. ఆ శబ్దాన్ని నియంత్రించడానికి ప్రత్యేక సస్పెన్షన్ ని వాడుతున్నది రైల్వే కోచ్ ఫాక్టరీ విభాగం. ఆ శబ్దం పౌనఃపున్యం మనకి నిద్ర వచ్చేలా చేసే విధంగా బోగీ సస్పెన్షన్ ని డిజైన్ చేశారు. చెప్పాలంటే రైల్వే గురుంచి చెప్పుకోవాల్సింది రెండు పుస్తకాలంత ఉంటుంది.
ఒక ఇంజిన్ కానీ లేదా కోచ్ గానీ డిజైన్ చేసేటప్పుడు అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని మరీ డిజైన్ చేస్తారు. ఇలాంటి విభాగం మన దేశంలోనే ప్రత్యేకంగా ఉంది. విదేశాలలో రైలు పట్టాల మీదకి పశువులు రావు.

Vande Bharat Express
Vande Bharat Express

మనం ప్రయాణించే ట్రైన్ అది ఏది అయినా సరే దానికి రూపాయి ఖర్చు అవుతుంటే టికెట్ రూపం లో రైల్వే చార్జ్ చేసేది 60 పైసలు మాత్రమే. అంటే ప్రయాణీకుల రైళ్ల మీద భారత రైల్వేస్ కి 40% నష్టం వస్తున్నది. దీనిని గూడ్స్ రైళ్లు నడిపి ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నది. మా బండిని ఆపేసి గూడ్స్ ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే దానికి అర్థం ఇదే.

ప్లాట్ ఫామ్ టికెట్ అంత ఖరీదా ? ఇద్దరిని ట్రైన్ ఎక్కించడానికి తండోప తండాలుగా తరలి వస్తారు స్టేషన్ కి. వచ్చిన వాళ్ళు క్రమ శిక్షణతో ఉంటారా ? బోగీలోకి ఎక్కే చోట అడ్డంగా నిలబడి మాట్లాడుతుంటారు కానీ తొందరలో ట్రైన్ ఎక్కే వాళ్ళకి స్థలం ఇవ్వరు. లగేజీ తో వచ్చే ప్రయాణీకులకి ప్లాట్ ఫారం మీద అడ్డంగా నిలబడి ఉంటారు. ప్లాట్ ఫారం టికెట్ రేట్ ఎంత పెంచినా తప్పులేదు దీనివల్ల 10 మంది వచ్చే వాళ్ళు ఇద్దరే వస్తారు వీడ్కోలు చెప్పడానికి. అదే బస్టాండ్ కి ఈ స్థాయిలో వెళ్లరు ! అక్కడ ఫ్లాట్ ఫారం టికెట్ ఉండదు కదా?

Also Read: Rajaraja Chola Controversy: కొత్త వివాదం : చోళ రాజుల హిందువులు కాదా? వాళ్లు నిర్మించిన ఆలయాలు ఏవి? ఎలాంటివి..!?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version