ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోడీ జగన్‌కే ఎందుకిచ్చారు..

వైసీపీ ఎన్డీయేలోకి చేరుతోందన్న వార్తలపై ఢిల్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ప్రధాని మోడీతో జగన్‌ భేటీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా మొదలైనప్పటి నుంచి ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోడీ.. తాజాగా జగన్‌కు ఇవ్వడంపై ఆసక్తి నెలకొంది. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే.. జగన్‌ ఎన్డీయే లోకి చేరబోతున్నారన్న విషయాన్ని ఆ వైసీపీ నేతలు కూడా ఖండించడమూ లేదు.. ఇటు […]

Written By: NARESH, Updated On : October 7, 2020 12:21 pm
Follow us on

Jagan modi

వైసీపీ ఎన్డీయేలోకి చేరుతోందన్న వార్తలపై ఢిల్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ప్రధాని మోడీతో జగన్‌ భేటీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా మొదలైనప్పటి నుంచి ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోడీ.. తాజాగా జగన్‌కు ఇవ్వడంపై ఆసక్తి నెలకొంది. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే.. జగన్‌ ఎన్డీయే లోకి చేరబోతున్నారన్న విషయాన్ని ఆ వైసీపీ నేతలు కూడా ఖండించడమూ లేదు.. ఇటు నిక్చచ్చిగా చెప్పడమూ లేదు.

Also Read: కేసీఆర్.. జగన్ ల జల జగడం ఎటు దారితీస్తుంది?

వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రధానమంత్రితో సీఎం సమావేశం ఫలప్రదంగా జరిగింది. రాష్ట్రానికి అన్ని రకాలుగానూ సహకారం అందించడానికి పీఎం సానుకూలత వ్యక్తం చేశారు’ అంటూ అందులో పేర్కొన్నారు.

ఈ ట్వీట్లో విజయసాయిరెడ్డి అటు ఎన్డీయేలో చేరడంపై కానీ.. ఇటు రాజకీయ చర్చలపై కానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ ఎన్డీయేలో చేరికపై ప్రధాని ఇప్పుడే తొందర వద్దని ఆగమన్నారా..? లేక మరే ఇతర చర్చలేమైనా జరిగాయా..? అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త… అంగన్‌వాడీల్లో భారీగా పోస్టుల భర్తీ!

ఎలాగూ.. ఎన్డీయేలో చేరకున్నా వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగుతోంది. కేంద్రం తీసుకొస్తున్న ప్రతీ బిల్లుకు మద్దతు తెలుపుతూనే ఉంది. అయితే ఎన్డీయేలోకి చేరితే జ‌గ‌న్ రూటు కొంత వ‌ర‌కూ మారిన‌ట్టుగా అవుతుంది. అందుకే ఈ విష‌యంలో పార్టీకి త‌ర్జన‌భ‌ర్జన‌లు ఉండ‌నే ఉంటాయి. అన్నింటికీ మించి రాష్ట్రానికి ప్రత్యేక‌ హోదాపై మోడీ సానుకూలంగా స్పందిస్తే.. వైసీపీకి అంతకన్నా పెద్ద విజయం ఉండదు. ప్రధాని మోడీతో భేటీలో ఈ అంశంపై ఎంతవరకు హామీ లభించింది.. అసలు వైసీపీ ఎన్డీయేలో చేరుతుందా..?  భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి..? తెలియకుండా ఉంది. ఈ భేటీపై ఎవరో ఒకరు స్పందించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితులు లేవు.