Why BJP Losing State After State: బీజేపీకి రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి.. మోడీ వ్యూహం రాష్ట్రాల్లో పనిచేయడం లేదా? అంటే ఔననే సమాధానం వస్తోంది. బెంగాల్, ఒడిషా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఎదురుదెబ్బలు తగిలాయి.. కారణం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Narendra Modi
మోడీ చరిష్మా తగ్గలేదని ఒపినీయన్ పోల్స్ చెబుతున్నాయి. మోడీ చరిష్మా బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది. ఫలితాలు బాగా ఉండడం లేదు. కారణాలు ఏమై ఉంటాయి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి.
Also Read: కేటీఆర్ కృషి ఫలించింది.. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ వచ్చింది.. ఐటీ నగరంగా హైదరాబాద్
2014 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత జరిగిన ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీ ఓడిపోయింది. ఎందుకని ఇలా బీజేపీ ఓడిపోతోంది. కారణం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న.
Also Read: AP Assembly Session 2022: వైసీపీని నిలదీసేందుకు టీడీపీ ప్రయత్నించినా కుదరలేదా?
మోడీ చరిష్మా పార్లమెంట్ కు సూట్ అవుతుంది తప్పితే.. అసెంబ్లీకి పనిచేయడం లేదు. మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోవడం.. బీజేపీ నేతలు బలంగా లేకపోవడంతో స్థానికంగా ఉన్న బలమైన సీఎం అభ్యర్థులు, పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు బలహీనపడుతుందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..