Homeజాతీయ వార్తలువిజయశాంతి సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?

విజయశాంతి సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?

vijayasanthi to join bjp

రాములమ్మ రగిలిపోతోంది. కాంగ్రెస్ లో ఉండలేకపోతోంది. బీజేపీ పిలిచినా వెళ్లలేకపోతోంది. అసలు రాములమ్మ మనసులో ఏముంది? ఆమె పయనం ఎటు? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో కొద్దిరోజులుగా విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు విజయశాంతిని ఇంటికి వెళ్లి కలిసి బీజేపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత మాణిక్యం ఠాగూర్ కూడా ఏకాంతంగా విజయశాంతితో మాట్లాడారు. ఈ క్రమంలోనే విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

విజయశాంతి తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. బీజేపీలో విజయశాంతి చేరబోతుందా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్ లోని నిస్తేజాన్ని ఆమె బయటపెట్టారు. అదే సమయంలో బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారుతుందన్న వాస్తవాన్ని కళ్లకు గట్టారు.

Also Read: కాంగ్రెస్.. బీజేపీలపై ఫైరవుతున్న కేటీఆర్.. ఎందుకు?

తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ సంచలనమైంది. ‘కాంగ్రెస్ నేతల్లో కొందరిని సీఎం కేసీఆర్ ప్రలోభ పెట్టి.. మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్ లోకి తీసుకున్నారని.. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారని’ విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ ను బలహీనపరచడం వల్ల ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరిందని.. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జిగా మాణిక్యం ఠాగూర్ మరికొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని విజయశాంతి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: అమెరికాలో తీవ్రమైన అల్లర్లు.. ట్రంప్ మద్దతుదారుల దాడులు..

విజయశాంతి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పని తెలంగాణలో ఖతమైందని అర్థం వచ్చే లా ఉంది. అదే సమయంలో బీజేపీ మాత్రం టీఆర్ఎస్ కు సవాల్ చేసే స్థితిలో ఉందని వ్యాఖ్యానించింది.. మాణిక్యం ఠాగూర్ లేట్ గా స్పందించాడనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించారు.. దీంతో విజయశాంతి పార్టీ మార్పు ఖాయమా అన్న ప్రచారం సాగుతోంది. ఈ నెలఖారులోనే విజయశాంతి బీజేపీ చేరబోతోందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version