Homeజాతీయ వార్తలుVijay Emotional Reaction: పదేళ్ల బాలిక.. విజయ్ కన్నీళ్లు.. రాజీనామాకు డిమాండ్.. తమిళనాడులో ఏం జరిగింది..

Vijay Emotional Reaction: పదేళ్ల బాలిక.. విజయ్ కన్నీళ్లు.. రాజీనామాకు డిమాండ్.. తమిళనాడులో ఏం జరిగింది..

Vijay Emotional Reaction: కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశ మీడియాలో అంతగా స్థానాన్ని ఆక్రమించడం లేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకముందు చోటు చేసుకున్న పరిణామాలు.. అయిన తర్వాత జరిగిన సంఘటనలపై జాతీయ మీడియా విస్తృతంగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత విజయ్ తన పరిపాలనలో పడిపోయారు.. జాతీయ మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. అయితే ఇది కొద్దిరోజులు మాత్రమే.. ఎందుకంటే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి మొత్తం తమిళనాడు మీద పెట్టింది. తమిళనాడు లో జరిగిన ఓ సంఘటన దీనికి కారణం.

తమిళనాడులో పారిశ్రామిక రాజధానిగా పేరుపొందింది. కోయంబత్తూరు. ఈ నగరంలో 30 సంవత్సరాల బాలిక దుకాణానికి వెళ్ళింది.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు విచారణలో ఆ బాలిక హత్యకు గురైనట్టు తెలిసింది. అయితే ఆమె హత్య వెనక కార్తీక్.. మోహన్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కోయంబత్తూర్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాజకీయాలను తీవ్రంగా కుదిపి వేస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.. భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కచ్చితంగా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబం ఉంటే.. వారిని టీవీ కే ఎమ్మెల్యే ఎన్ఎం కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

అయితే ఈ బాలిక హత్య సంఘటన తమిళనాడు రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతోంది. విజయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే ఈ ఘటన జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు చేసే వారి సంఖ్య పెరిగిపోతుందని డీఎంకే ఆరోపణలు మొదలుపెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణ సరిగా లేదని.. అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిది స్టాలిన్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతను కాగితాలలో కాకుండా.. చేతల్లో చేసి చూపించాలని ఉదయనిది డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని సూచించారు.

మరోవైపు బిజెపి నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలను మొత్తం నాశనం చేసిందని.. ఇప్పుడు విజయ్ దానిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూర్ లోని కన్నపాలెం గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం దుకాణానికి వెళ్లిందని.. ఆ తర్వాత ఇంటికి రాలేదని.. బాలిక తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. శుక్రవారం స్థానికంగా ఉన్న ఒక చెరువులో ఆమె మృతదేహం కనిపించిందని నారాయణన్ పేర్కొన్నారు. అయితే పోలీసులు విచారణలో ఓ వ్యక్తి ఆ బాలికను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్ళినట్టు తేలింది. అతనితోపాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular