spot_img
Homeజాతీయ వార్తలుVijay Emotional Reaction: పదేళ్ల బాలిక.. విజయ్ కన్నీళ్లు.. రాజీనామాకు డిమాండ్.. తమిళనాడులో ఏం జరిగింది..

Vijay Emotional Reaction: పదేళ్ల బాలిక.. విజయ్ కన్నీళ్లు.. రాజీనామాకు డిమాండ్.. తమిళనాడులో ఏం జరిగింది..

Vijay Emotional Reaction: కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశ మీడియాలో అంతగా స్థానాన్ని ఆక్రమించడం లేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకముందు చోటు చేసుకున్న పరిణామాలు.. అయిన తర్వాత జరిగిన సంఘటనలపై జాతీయ మీడియా విస్తృతంగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత విజయ్ తన పరిపాలనలో పడిపోయారు.. జాతీయ మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. అయితే ఇది కొద్దిరోజులు మాత్రమే.. ఎందుకంటే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి మొత్తం తమిళనాడు మీద పెట్టింది. తమిళనాడు లో జరిగిన ఓ సంఘటన దీనికి కారణం.

తమిళనాడులో పారిశ్రామిక రాజధానిగా పేరుపొందింది. కోయంబత్తూరు. ఈ నగరంలో 30 సంవత్సరాల బాలిక దుకాణానికి వెళ్ళింది.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు విచారణలో ఆ బాలిక హత్యకు గురైనట్టు తెలిసింది. అయితే ఆమె హత్య వెనక కార్తీక్.. మోహన్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కోయంబత్తూర్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాజకీయాలను తీవ్రంగా కుదిపి వేస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.. భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కచ్చితంగా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబం ఉంటే.. వారిని టీవీ కే ఎమ్మెల్యే ఎన్ఎం కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

అయితే ఈ బాలిక హత్య సంఘటన తమిళనాడు రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతోంది. విజయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే ఈ ఘటన జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు చేసే వారి సంఖ్య పెరిగిపోతుందని డీఎంకే ఆరోపణలు మొదలుపెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణ సరిగా లేదని.. అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిది స్టాలిన్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతను కాగితాలలో కాకుండా.. చేతల్లో చేసి చూపించాలని ఉదయనిది డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని సూచించారు.

మరోవైపు బిజెపి నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలను మొత్తం నాశనం చేసిందని.. ఇప్పుడు విజయ్ దానిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూర్ లోని కన్నపాలెం గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం దుకాణానికి వెళ్లిందని.. ఆ తర్వాత ఇంటికి రాలేదని.. బాలిక తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. శుక్రవారం స్థానికంగా ఉన్న ఒక చెరువులో ఆమె మృతదేహం కనిపించిందని నారాయణన్ పేర్కొన్నారు. అయితే పోలీసులు విచారణలో ఓ వ్యక్తి ఆ బాలికను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్ళినట్టు తేలింది. అతనితోపాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper