Vijay Government: తమిళనాడులో టీ వీ కే అధినేత విజయ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందా.. దీనికోసం భారీగానే వ్యవహారం సాగించారా.. వందల కోట్లు సమకూర్చుకున్నారా.. ఇందులో కార్పొరేట్ కంపెనీ రంగ ప్రవేశం చేసిందా.. దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. ఎందుకు ఈ స్థాయిలో కుట్రకు పాల్పడ్డారు.. ఈ ప్రశ్నల ఆధారంగానే తమిళనాడు మీడియాలో కొద్ది రోజులుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కుట్రకోణం వెలుగులోకి రావడంతో అసలు నిజాలు బయటపడుతున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి విజయ్ పై డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ తరచూ పిలుపునిస్తూనే ఉన్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిది ఏకంగా విజయ్ కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగారు. ఎవరో తన భర్త కోసం కోర్టు దగ్గర ఉన్నారంటూ పరోక్షంగా ఆరోపణలు చేశారు.. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు ఇలా ఉండకుంటే ఆశ్చర్యం.. ఇలా సాగుతుంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆశ్చర్య పడాల్సిన అవసరం అంతకంటే లేదు.
విజయ్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పదిమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏకంగా 180 కోట్లను నిధులను సమకూర్చుకున్నట్టు సమాచారం.. డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ.. అతడు తమ్ముడు ఆధ్వర్యంలో 35 కోట్ల ఒప్పందం చేసుకున్నాం.. అయితే ఎమ్మెల్యేలు ఎవరు డబ్బుకు, బెదిరింపులకు లొంగలేదని పోలీసుల విచారణలో నిందితులు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీ ఎవరిది.. ఈ స్థాయిలో డబ్బులు ఎలా సమకూర్చుకుంది.. దాని వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ఇలాంటి చర్చలే తమిళనాడులో జరిగాయి. డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ నేరుగా రంగంలోకి దిగడం.. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఐయూఎంఎల్ పార్టీలతో సమన్వయం చేసుకొని.. మద్దతు దక్కే విధంగా అడుగులు వేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి స్వల్ప కాలంలోనే ఇలా కుట్రలు జరగడం విశేషం. అయితే ఈ వ్యవహారం విజయ్ రేంజ్ ను తమిళనాడులో మరింత పెంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

