spot_img
Homeజాతీయ వార్తలుజనంపై ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు..

జనంపై ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు..


లాక్ డౌన్ తో ఆదాయ వనరులు మూసుకు పోయి ఇబ్బంది పడుతున్న జనంపై ఇప్పటికే మద్యం ధరలు, పెట్రోల్ ధరలు పెంచి భారం మోపిన ప్రభుత్వాలు ఇక ఆర్టీసీ ధరలు పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. ఎప్పుడు ఆర్టీసీ బస్సులను నడిపిన 50 శాతం మేరకు ధరలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

బస్సు ‌‌ సామర్ధ్యంలో 50 శాతం ప్రయాణికులతో మాత్రమే నడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, లాక్‌‌డౌన్‌‌ వల్ల ఆర్టీసీ రూ 750 కోట్ల మేర ఆదాయం కోల్పోవడంతో.. చార్జీలు పెంచక తప్పదని అధికారులు అంటున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రీన్‌‌ జోన్లలో బస్సులను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మార్చి 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, మెడికల్‌‌ స్టాఫ్‌‌, కార్గో సర్వీసుల కోసం మాత్రమే నడుపుతున్నారు. ఇందులో కార్గో సర్వీసులకే చార్జీలు చెలిస్తున్నారు. ‌‌ సంస్థకు రోజుకు రూ.12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు వచ్చేది. మార్చి 22 నుంచి ఈనెల 15వ తేదీ వరకు 750 కోట్ల ఆదాయం కోల్పోయింది.

ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!

సమ్మె సమయంలో రెండు నెలలు బస్సులు పెద్దగా నడవకపోవడంతో ఇంతేస్థాయిలో ఆదాయం ‌‌కోల్పోయింది. బస్సులు నడవకున్నా 50 శాతం జీతాలతోపాటు, పన్నులు, ఆర్టీసీ అప్పుల వడ్డీలు కట్టక తప్పడంలేదు.

గ్రామీణ ప్రాంతాలలో ఇది వరలో రద్దీ సమయంలో సామర్థ్యంపై మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొనేవారు. కానీ ఇప్పుడు 25 మందికి మించి ఎక్కించుకోవడానికి వీలుండదు. దానితో అన్ని బస్సులు నడిపినా రోజుకు రూ.5 కోట్లకు మించి ఆదాయం రావడం కష్టం కాగలదని భావిస్తున్నారు.

డిసెంబర్‌‌ 3 నుంచి కిలోమీటర్‌‌కు 20 పైసల చొప్పున బస్సు చార్జీలు పెంచారు. దీంతో ఆర్టీసీకి ఏటా 752 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అన్నీ పోగా రోజుకు సగటున కోటి వరకు లాభం వచ్చేంది. లాక్‌‌డౌన్‌‌ వల్ల పరిస్థితి మొదటికి వచ్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper
Exit mobile version