spot_img
Homeజాతీయ వార్తలుTMC Leader Gold Bed: టీఎంసీ నేత ఇంట్లో బంగారు పరుపు, సోఫా.. పోలీసులు అరెస్ట్...

TMC Leader Gold Bed: టీఎంసీ నేత ఇంట్లో బంగారు పరుపు, సోఫా.. పోలీసులు అరెస్ట్ చేశారు గాని.. లేకుంటే కేజీఎఫ్ ను మించిపోయేవాడు..

TMC Leader Gold Bed: ప్రభుత్వం ఇచ్చే పింఛన్ లో 300 టీఎంసీ కార్యకర్తలకే. ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ లో కొంత వాటా వాళ్లకే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో వారికి భాగం వెళ్లాల్సిందే. దీనికి బెంగాల్ ప్రజలు పెట్టిన పేరు కట్ మని.

15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత.. మమతా బెనర్జీ సంపూర్ణ అధికారాలు వచ్చిన తర్వాత టిఎంసి కార్యకర్తలు జలగల మాదిరిగా జనాల మీద పడ్డారు. వారి రక్త మాంసాలను దోచుకున్నారు. ప్రజల కష్టాన్ని తమకు ఆర్జితంగా మార్చుకున్నారు. ఫలితంగా టీఎంసీ కార్యకర్తలు ఆగర్భ శ్రీమంతులుగా మారిపోయారు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి రావడంతో.. వారి అక్రమ లీలలు బయటపడిపోతున్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ కేసును బిజెపి ప్రభుత్వం అంత సులభంగా తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు పై విచారణ సాగించాలని అధికారులకు సూచించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన విషయాలు తెలిసాయి. బాంబు పేలుడులో టీఎంసీ నేత షమీం అహ్మద్ కీలకపాత్ర పోషించాడని వెలుగులోకి వచ్చింది.

పూర్తి ఆధారాలతో షమీం ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. అతడు నివాసం ఉంటున్న నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో ఒక సీక్రెట్ ప్లాట్ ఉంది. అందులో బంగారంతో తయారుచేసిన పరుపు.. గోల్డ్ సోఫా.. ఇంకా అనేక రకాల ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. వాస్తవానికి షమీం అహ్మద్ టిఎంసిలో చాలా కిందిస్థాయి నాయకుడు. అతడి ఇంట్లోనే ఈ స్థాయిలో బంగారం.. ఖరీదైన వస్తువులు ఉంటే.. ఇక పెద్దపెద్ద నాయకుల ఇళ్లల్లో ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చని బెంగాల్ లోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మమత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు టీఎంసీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో తమ వాటా తీసుకున్నారు. అభివృద్ధి పథకాలలో కూడా తన భాగాన్ని బెదిరించి మరి లాక్కున్నారు. చూస్తుండగానే కోట్లకు పడగలు ఎత్తిపోయారు. అటు బెంగాల్ రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి లేకపోవడం.. పెద్ద పెద్ద కంపెనీలు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. యువత వలసలు వెళ్లే దుస్థితి దాపురించింది. ఇంత జరిగినప్పటికీ మమతలో మార్పు రాలేదు. ప్రజలకు అంతంత మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓట్లు దండుకున్నారు. చివరికి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టారు.

మూడు పర్యాయాలు ఇలా అధికారంలోకి వచ్చినప్పటికీ.. చివరిసారి మాత్రం బెంగాల్ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఫలితంగా టి ఎం సి అధికారానికి దూరమైంది.. వచ్చిన అవకాశాన్ని బిజెపి నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టీఎంసీ నేతల బాగోతాలను బయటపెడుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో షమీం అహ్మద్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారని.. వారందరి అక్రమ సంపాదన మొత్తం బయటికి తీస్తామని బిజెపి నాయకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version