ఇంటికి వెళ్లే వారికి రూ. 2 వేలు సాయం!

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్ళేటప్పుడు పేదలకు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించమని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారంటైన్ నుంచి ఇళ్లకు వెళ్లిన బాధితులకు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చూడాలనని కోరారు. క్వారంటైన్‌ సెంటర్లలో […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 4:55 pm
Follow us on


క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్ళేటప్పుడు పేదలకు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించమని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారంటైన్ నుంచి ఇళ్లకు వెళ్లిన బాధితులకు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చూడాలనని కోరారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్న సూచించారు.

రాష్ట్రంలో కోవిడ్‌విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను సీఎంకు అందించిన అధికారులు. మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్‌ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామన్న అధికారులు. ప్రస్తుతం రోజుకు 2100కుపైగా పరీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ట్రూనాట్‌ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. వీరికి పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అయిన తర్వాత ర్యాండమ్‌గా పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.

క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌కోసం, దుప్పటికోసం రూ. 500లు. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం,
ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించిన అధికారులు సీఎంకు వివరించారు. డబుల్‌ రూం లేదా, సింగిల్‌రూం ఇస్తున్నామని చెప్పారు.

ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలన్న జగన్ సూచించారు. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వంటనూనెల ధరలపై దృష్టి పెట్టాలన్నారు. ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌సహా అధికారులు హాజరయ్యారు.