Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల బాలుడని.. నూనూగు మీసాలు కూడా రాణి బుడ్డోడని.. ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్య వంశీ గురించి చెప్పుకున్నాం కదా. కానీ మనం ఇకనుంచి అతడిని అలా అనకూడదు. ఎందుకంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. అతడు చేసే చేష్టలు మామూలుగా లేవు. ఏకంగా కోట్లకు ఎసరు పెట్టాడు. అంతేకాదు రూపాయి తక్కువైనా చేసేది లేదని.. ఇది వ్యాపారం అని చెబుతున్నాడు.
వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో ఈ సంవత్సరం గట్టిగానే వెనుక వేసుకున్నాడు. రఫ్ గా ఒక ఆరు కోట్లు జేబులో వేసుకున్నాడు. అంతరంగిక వర్గాల ప్రకారం ఆ లెక్క ఇంకా గట్టిగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సూర్య వంశీ కెరియర్ పీక్స్ లో ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు అదే అదృష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. కేవలం వైభవ్ సూర్యవంశీని చూసేందుకు మాత్రమే అభిమానులు వచ్చారంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేసి.. సూర్య వంశీ పేరుతో ప్లకార్డులను అభిమానులు పట్టుకొచ్చారు. మైదానంలో ప్రదర్శన చేశారు.
సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. రెండో మ్యాచ్లో అవకాశం ఇవ్వక తప్పడం లేదు. అతడు లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ మ్యాచ్లో కచ్చితంగా అతడికి అవకాశం లభిస్తుంది.
వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీకి సంబంధించిన బ్యాట్ వాడుతున్నాడు. అయితే అతడు త్వరలోనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడితో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ సూర్య వంశీకి 6 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సూర్య వంశీ 12 కోట్లు అయితేనే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓకే చెబుతానని చెప్పినట్లు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ రాలేదు. మరోవైపు సూర్య వంశీ.. ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సూర్య వంశీ 15 సంవత్సరాల వయసులోనే కోట్లు వెనకేసుకుంటున్నాడు. తన తోటి పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే.. అతడేమో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. బుడ్డోడు అంటే చిన్నోడు కాదు.. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న బలవంతుడు.
