Homeజాతీయ వార్తలుLiquor: మోదీ సార్‌.. ఇదీ పాయింటే.. వన్‌ నేషన్‌.. వన్‌ రేటు కోసం మద్యం...

Liquor: మోదీ సార్‌.. ఇదీ పాయింటే.. వన్‌ నేషన్‌.. వన్‌ రేటు కోసం మద్యం ప్రియుల కొత్త డిమాండ్‌

Liquor: దేశంలో ఇప్పుడు అంతటా వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ గుచించే చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యయం తగ్గించడం, ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం, సమయం వృథా కాకుండా చూడడం, అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ నినాదం అందుకుంది. ఈ క్రమంలో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చేసింది. తర్వాత రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిషన్‌ వేసింది. కమిషన్‌ నివేదిక తర్వాత అందులోని సూచనల మేరకు కొత్త బిల్లును రూపొందించింది. లోక్‌సభ అనుమతితో డిసెంబర్‌ 17న లోక్‌సభలో బిల్లు పెట్టింది. అయితే దీనిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు మోదీ కూడా ఓకే చెప్పారు. ఈమేరకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంతా దీనిపైనే చర్చ జరగుతోంది.

కొత్తగా వన్‌ నేషన్‌.. వన్‌ రేట్‌ నినాదం..
వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌పై ఒకవైపు చర్చ జరుగుతుండగానే.. మద్యం ప్రియులు ఇప్పుడు కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మద్యం రేటు కూడా దేశమంతా ఒకేలా ఉండాలని కోరుతున్నారు. జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు ఒకే దేశం ఒకే రేటు ఎందుకు ఉండకూడాదన్న డిమాండ్‌ వస్తోంది. దయచేసి ఆలోచించండి అంటూ ట్వీట్‌ చేశాడు. గోవాలో రూ.320 ఉన్న వైన్‌ బాటిల్‌.. కర్ణాటకలో రూ.920 ఉందని పేర్కొన్నాడు. అందుకే వన్‌ నేషన్, వన్‌ రేట్‌ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

మొన్నటి వరకు బంగారంపై..
ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు బంగారం ధరలపై కూడా చాలా మంది వన్‌ నేషన్, వన్‌ రేట్‌ విధానం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కేలా రేట్లు ఉండడం ఏంటని ప్రశ్నించారు. జీఎస్టీ దేశమంతా ఒకేలా విధిస్తున్నప్పుడు ధరలు కూడా ఒకేలా ఉండాలని చాలా మంది కోరుతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. ఇలా వన్‌ నేషన్‌ వన్‌ రేట్‌ స్లోగన్‌ ఫేమస్‌ అయింది. ఇప్పుడు మందు బాబులు కూడా ఇదే స్లోగన్‌ అందుకున్నారు.

ఐఆర్‌ఎస్‌ పోస్టుకు రిప్లయ్‌లు..
ఐఆర్‌ఎస్‌ అధికారి పెట్టిన ట్వీట్‌పై చాలా మంది స్పందిస్తున్నారు. మోదీజీ ఈ నినాదం సరైనదే కదా అని పేర్కొంటున్నారు. అన్ని సరుకులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినప్పడు.. ధరలు కూడా ఒకేలా ఉండేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper