
మొన్నటి వరకు ఏపీలో పల్లె పంచాయతీల ఓట్ల పండగ ముగిసింది. ఆ ఎన్నికలతో ఏ పార్టీ బలమెంతో తేలిపోయింది. నిన్న పట్టణాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. నిన్న ఏపీలోని 2 కార్పొరేషన్లతోపాటు 75 నగర పంచాయతీలు/మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పట్టణాల్లో ప్రభుత్వంతోపాటు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత క్యాష్ చేసుకుని 50 శాతం స్థానాలలో తప్పుకుండా గెలుస్తామన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. కానీ.. ఆ ఆశలు నెరవేరుతాయా..? లేదా అనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు.
Also Read: బ్రేకింగ్: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. తీవ్ర ఉద్రికత్త
అయితే.. టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సీన్ ఉందా అనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు బేరీజు వేసుకుంటే టీడీపీ సింగిల్ డిజిట్ మున్సిపాల్టీలు దక్కించుకుంటేనే గొప్ప అన్నట్టుగా మరికొందరు అంటున్నారు. ఉన్నంతలో శ్రీకాకుళం జిల్లాతో పాటు రాజధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో మాత్రమే టీడీపీకి కాస్తో కూస్తో ఆశలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా వీక్గా ఉన్న చోట పైకి ఆశలు ఉన్నా రేపటి రోజున ఫలితాల్లో దానిని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా? అన్నది కూడా డౌటే. టీడీపీకి ఆశలు ఉన్న స్థానాలు ఆ పార్టీ నేతల లెక్కల ప్రకారం ఏకంగా 35 నుంచి 40 వరకు ఉన్నా అవన్నీ కలలే అనుకోవాలి. శ్రీకాకుళం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఇచ్ఛాపురం, పలాసలో కాస్త ఆశలు ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలోనూ టీడీపీకి కొన్ని ఆశలు కనిపిస్తున్నాయట. ఇక తూర్పు గోదావరిలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం పెద్దాపురంలో ఛాన్స్ ఉంటే ఉండొచ్చని అంచనా. పశ్చిమ గోదావరిలో నిడదవోలుపై కలలు కంటోంది టీడీపీ. కృష్ణాలో నందిగామ, ఉయ్యూరు, పెడన లాంటి చోట్ల ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఇక అమరావతి జిల్లా గుంటూరులో తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె ఈ మూడు చోట్ల టీడీపీకి హోప్ ఉంది. ప్రకాశంలో అద్దంకి ఒక్కటి మాత్రమే గెలిచే అవకాశం ఉంది.
Also Read: వైరల్: విశాఖ ఉక్కు ఉద్యమంపై చిరంజీవి సంచలన ట్వీట్
మరోవైపు.. కడప, కర్నూలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టీడీపీ మాత్రం ప్రొద్దుటూరు లాంటి చోట్ల పగటి కలలు కంటున్నట్టే ఉంది. చిత్తూరులో నగరి నియోజకవర్గంలో పుత్తూరులో టీడీపీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. ఇక అనంతపురంలో హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం లాంటి చోట్ల గట్టి పోటీలో అయినా గెలుస్తామన్న ఆశలు టీడీపీకి ఉన్నాయి. అయితే.. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ డబుల్ డిజిట్ సాధిస్తేనే చాలా గ్రేట్ అనిపించే వాతావరణం ఉంది. రిజల్ట్ డే ఈనెల 14వ తేదీన ఏ పార్టీ భవిష్యత్ ఏంటో తేలనుంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్