Pawan Kalyan
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి, ప్రస్తుతం ఇప్పుడు సామాన్యుల దగ్గరి నుండి రాజకీయ విశ్లేషకుల వరకు ప్రతీ ఒక్కరు జనసేన ‘వారాహి యాత్ర’ వైపే చూస్తున్నారు. ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్నో సమస్యలు ,కష్టాలని వెలికి తియ్యడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కత్తిపూడి సభ తో ప్రారంభమైన ఈ యాత్ర, నిన్న పిఠాపురం వరకు సాగింది.
ఇప్పుడు కాకినాడ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాడు, రేపు ఈ ప్రాంతం లో భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఈ సభ కోసం జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గ MLA ద్వారంపూడి జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపాడు,ఆ MLA సహచరుడు పిస్టల్ తీసి బెదిరించాడట కూడా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి తెలిసింది, ఆయన నిన్న పిఠాపురం సభలోనే కాకినాడ కి వెళ్తున్న కదా, అక్కడ తెలుస్తా అతని సంగతి అని చెప్పుకొచ్చాడు.
ఇక పోతే నేడు పవన్ కళ్యాణ్ కాకినాడ లో ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాడు, ఈ కార్యక్రమం లో స్థానికంగా ఉన్న ప్రజలు తమ కష్టాలను చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ వద్ద బోరుమని ఏడ్చేశారు. ఒక అంగవికలాంగుడు మరియు అతని సతీమణి పవన్ కళ్యాణ్ వద్ద చెప్పుకున్న కొన్ని సమస్యలు వింటే కంటతడి పెట్టేస్తారు. అసలు విషయం లోకి వెళ్తే ప్రభుత్వం తరుపున వికలాంగులకు పెన్షన్ ప్రతీ నెల ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం పెన్షన్ డబ్బులతోనే బ్రతికే ఈ దంపతులు కరెంటు చార్జీలు ఎక్కువ వచ్చాయని పెన్షన్ కట్ చేశారట.
ఎంత బ్రతిమిలాడుకున్నా కూడా తిరిగి పెన్షన్ మంజూరు చేయలేదట. ఈ విషయాన్నీ స్థానికంగా ఉన్న జనసేన MLA అభ్యర్థి పంతం నానాజీ కి చెప్పుకోగా, ఆయనే గత మూడు నెలల నుండి పెన్షన్ ఇస్తున్నాడట.ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ తో చెప్పుకొని బోరుమని విలపించడం తో పవన్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నువ్వు ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలి అన్నా అని అడగగా, ముందు మీ బాధ తీరుస్తాను, ఆ తర్వాత సంగతి తర్వాత అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ .
chusthunte kantlo nillu tirugutunay physically challenged vala midha prathapam entra pic.twitter.com/6hu7yZHGbg
— Rusthum (@RusthumHere) June 17, 2023