Homeజాతీయ వార్తలు75th Constitution Day 2024: రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు.. సెక్యులర్, సోషలిస్ట్‌ పదాల తొలగింపు అధికారం...

75th Constitution Day 2024: రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు.. సెక్యులర్, సోషలిస్ట్‌ పదాల తొలగింపు అధికారం పార్లమెంటుదే!

75th Constitution Day 2024: భారత రాజ్యాంగాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మార్చాలని చూస్తోందని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దీనిని విస్తృతంగా ప్రచారం.. మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారడం ఖాయం అని ఆరోపించాయి. అందుకే 390 సీట్లు అడుగుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కానీ, ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. అయితే పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. భారత రాజ్యాంగంలోని లౌకికవాదం, సామ్యవాదం తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ పదాలు బాగా లేవని అభిప్రాయపడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో సెక్యులర్‌(లౌకికవాదం), సోషలిస్ట్‌(సామ్యవాదం) పదాలు తొలగించాలని దాఖలుచేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా చారిత్రక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, బలరాం సింగ్, అశ్వినికుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.

సుప్రీం కోర్టులో పిటిషన్లు..
రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్‌ అనే పాదాలను 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అప్పగి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారు. అయితే ఈ పదాలను సవాల్‌ చేస్తూ తాజాగా సుబ్రహ్మణ్యస్వామి, బలరాం సింగ్, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ రెండు పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని కోరారు. అంతేకాదు 42వ రాజ్యాంగ సవరణపై అప్పటి పార్లమెంట్‌లో చర్చ జరగలేదని వాదించారు. 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ ఉందని, ఈ సమయంలో చేసిన సవరణకు చట్టబద్ధత ఉండదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై వివిధ పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. నవంబర 22న తీర్పు రిజర్వు చేసింది. తాజాగా వాటిని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

కీలక వ్యాఖ్యలు..
ఇక తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషలిస్ట్, సెక్యూలర్‌ అనే పాదాలకు పలు సవరణలు ఉన్నాయని పేర్కొంది. వాటిని వేర్వేరుగా అన్వయించుకుని గత విచారణ సమయంలోనే సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సోషలిజం అర్థం అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని అని తెలిపింది. సమానత్వాన్ని ప్రతిభింబిస్తుందని పేర్కొంది. ఇక సెక్యూలర్‌ అనే పదం కూడా అంతే అని తెలిపింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం సెక్యూలరిజమని, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమని వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Oktelugu Epaper
Exit mobile version