Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Ramachandra Reddy : పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫుల్ సైలెన్స్.. చెవిరెడ్డికి జగన్ పెద్దపీట!

Peddireddy Ramachandra Reddy : పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫుల్ సైలెన్స్.. చెవిరెడ్డికి జగన్ పెద్దపీట!

Peddireddy Ramachandra Reddy : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ పక్కన పెట్టారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యమిస్తున్నారా? బాలినేని చెప్పిన దాంట్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లుగా ఆ ఆరుగురిని నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దన్నారని చెప్పి మిధున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. ఇదే విషయంపై తాజాగా మాట్లాడారు బాలినేని. తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసేసరికి ఓపెన్ అయ్యారు బాలినేని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాక పెద్దిరెడ్డిని సైడ్ చేశారని చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్ కావడం మాత్రంఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి జగన్ చాలా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు.

* రాయలసీమ బాధ్యతలు
వైసీపీకి రాయలసీమలో చాలా పెద్ద నేతలు ఉన్నారు. కానీ వారందరినీ కాదని పెద్దిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జగన్. మొత్తం రాయలసీమ బాధ్యతలని అప్పగించారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలని కూడా సూచించారు. పెద్దిరెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. కానీ చంద్రబాబును టచ్ చేయలేకపోయారు. రాయలసీమ మొత్తాన్ని కైవసం చేసుకుంది కూటమి. చివరికి కడపను విడిచిపెట్టలేదు. అప్పటినుంచి పెద్దిరెడ్డి పై ఒక భావంతో ఉన్నారు జగన్. పట్టున్న వైసీపీని రాయలసీమలో దెబ్బతీసింది పెద్దిరెడ్డి అన్న అనుమానం మొదలైంది. అందుకే పెద్దిరెడ్డిని సైడ్ చేశారు. చెవిరెడ్డిని తన కోటరీలోకి తెచ్చుకున్నారు. పెద్దిరెడ్డికి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు.

* నగిరిలో పెద్దిరెడ్డి అనుచరులపై వేటు
నగిరిలో రోజా ప్రాతినిధ్యం వహించేవారు. ఆమె మంత్రిగా కూడా ఉండేవారు. అయితే రోజాపై అసమ్మతి వర్గాన్ని రేపింది పెద్దిరెడ్డి అని జగన్ కు తెలుసు. కానీ ఎన్నికలకు ముందుఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే అది ఇబ్బందికరంగా మారుతుందని జగన్ భావించారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత రోజా ఫిర్యాదు చేసిందే తరువాయి నగిరిలో చాలామంది వైసిపి నాయకులపై వేటు పడింది. వారంతా పెద్దిరెడ్డి అనుచరులే. తెలిసి కూడా చర్యలకు ఉపక్రమించారంటే జగన్ ఎంత ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది. ఇంకోవైపు చిత్తూరు జిల్లా బాధ్యతలు నుంచి పెద్దిరెడ్డిని తొలగించి భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించారు జగన్. భాస్కర్ రెడ్డి చెప్పారని మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా బాధ్యతలు నుంచి తప్పించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని వదులుకోవడానికి జగన్ సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పెద్దిరెడ్డి గత పదేళ్లుగా మరో పార్టీలో చేరలేని విధంగా రాజకీయాలు చేశారు. అందుకే వైసిపిలో అవమానాలు ఎదురవుతున్నా.. మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version