Homeఆంధ్రప్రదేశ్‌జలజగడంపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

జలజగడంపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ప్రారంభమైన వివాదం రచ్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ర్టం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడంతో తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని కోరింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుంచి తెలంగాణ రాష్ర్టం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నిలిపివేయాలని సూచించింది.

కృష్ణా బోర్డు రాసిన లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసింది. తెలంగాణ రాష్ర్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ బోర్డు చైర్మన్ కు రాసిన లేఖలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో ప్లానింగ్ కమిషన్, కృష్ణా మొదటి ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీనికి అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే ప్రాజెక్టులోని నీటిని ఉఫయోగించాలని ఇతరఅవసరాలకు మళ్లించడానికి వీలు లేదని గతంలో ప్రణాళిక సంఘం చెప్పిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1991 నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్, మే నెలల్లో ఏ రోజు కూడా నీటి మట్టం 834 అడుగులకు పైగా ఉండేలా చూడలేదన్నారు. ప్రస్తుతం 854 అడుగుల పైన ఉండాలని అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.

ఏఫీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పడం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నుంచి ఆ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో 50:50 నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రెండేళ్లుగా 170 టీఎంసీలు 120 టీఎంసీలు బేసిన్ వెలుపలకు తరలించిందన్నారు. పెన్నా బేసిన్ లో 360 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టిందన్నారు. చెన్నై తాగునీటి కోసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమేవినియోగించుకుంటున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లింకుపెట్టి ఆరోపణలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తీరుపై అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version