Homeజాతీయ వార్తలుSubhash Chandra Bose : ఈ బ్యాంకును సుభాష్ చంద్రబోస్ భారత సైన్యం ప్రారంభించింది.. ఎన్ని...

Subhash Chandra Bose : ఈ బ్యాంకును సుభాష్ చంద్రబోస్ భారత సైన్యం ప్రారంభించింది.. ఎన్ని డినామినేషన్ నోట్లు జారీ చేశారో తెలుసా?

Subhash Chandra Bose : నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ప్రముఖమైన నాయకుడు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చెరిపేయడంకోసం చేసిన పోరాటం ఇప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచింది. స్వతంత్ర భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేతాజీ, తనకంటూ ఒక ప్రత్యేక ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, భారతీయులను పోరాటంలో పాల్గొనడానికి ప్రేరేపించారు.

జనవరి 23 స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలు బోస్‌ను తమదైన రీతిలో గుర్తుంచుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం అనేక త్యాగాలు చేశారు. బ్రిటిష్ వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా అనేక పనులు చేశారు. వీటన్నింటితో పాటు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి తన సొంత బ్యాంకును ప్రారంభించింది. దీనికి ఆజాద్ హింద్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ఈ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడిందో, ఆజాద్ హింద్ బ్యాంక్ జారీ చేసిన మొదటి నోటు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చేసిన అనేక త్యాగాలను భారతీయులు చేసుకుంటారు. స్వతంత్ర భారతదేశానికి గొప్ప సేవలు చేసిన నేతాజీ, బ్రిటిష్ రాజుల పట్ల పోరాటం చేసి, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేతాజీ స్వతంత్ర పోరాటం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, బ్రిటిష్‌లను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఒక ప్రత్యేక బ్యాంకును స్థాపించి, ఆజాద్ హింద్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ బ్యాంకు 1943లో స్థాపించబడింది. ఆ బ్యాంకు విడుదల చేసిన మొదటి నోటు.. 10 రూపాయల నాణెంతో ప్రారంభమైంది. సుభాష్ చంద్రబోస్ పై ప్రధానమైన 10,000 రూపాయల నోటుపై ఆయన చిత్రం కూడా ఉంది.

ఆజాద్ హింద్ బ్యాంక్ శక్తివంతమైన అర్థిక వ్యవస్థను తయారు చేయడమే కాకుండా, స్వతంత్ర దేశాన్ని నిర్మించడానికి మార్గదర్శకంగా నిలిచింది. అయితే, 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం సంభవించిందని భావిస్తున్నారు.. కానీ అతని మరణం గురించి ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో జన్మించారు. ఆయన ఒక సంపన్న కుటుంబానికి చెందినవారు కాగా, చదువులో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచారు. అయితే, అతను అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ స్వతంత్ర భారతదేశం కోసం పోరాటం చేసే కష్టతరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన జీవితంలోని ఈ ప్రతిష్టాత్మక నిర్ణయంతో ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన జీవితాన్ని మనం మరింత గౌరవించి, దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular