హిందుత్వానికి మరక.. ఏపీలో మరో అపచారం

ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో హిందుత్వవాదుల మనసులకు గాయాలవుతున్నాయి. ఇది కుట్రపూరితమో.. లేక ఎవరైనా కావాలని చేస్తున్నారో తెలియదు కానీ.. వైఎస్ జగన్ సర్కార్ మాత్రం అభాసుపాలవుతోంది. తరుచుగా హిందూ ఆలయాలు, హిందుత్వ వాదులపై దాడులు కలకలం రేపుతున్నాయి. Also Read: లోకేష్ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదా…? తాజాగా ఏపీలో మరో అపచారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయితీ పరిధిలో ఈ అపచారం జరిగింది. వెంకటగిరిలోని వీధిలోని […]

Written By: NARESH, Updated On : September 13, 2020 10:01 am
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో హిందుత్వవాదుల మనసులకు గాయాలవుతున్నాయి. ఇది కుట్రపూరితమో.. లేక ఎవరైనా కావాలని చేస్తున్నారో తెలియదు కానీ.. వైఎస్ జగన్ సర్కార్ మాత్రం అభాసుపాలవుతోంది. తరుచుగా హిందూ ఆలయాలు, హిందుత్వ వాదులపై దాడులు కలకలం రేపుతున్నాయి.

Also Read: లోకేష్ ఆలోచనా తీరు ఎప్పటికీ మారదా…?

తాజాగా ఏపీలో మరో అపచారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయితీ పరిధిలో ఈ అపచారం జరిగింది. వెంకటగిరిలోని వీధిలోని ఓ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి మలాన్ని పూసారనే ప్రచారం జరిగింది. అసాంఘిక శక్తులు కొందరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బొమ్మూరు రేంజ్ డీఎస్పీ మాట్లాడుతూ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

మరోవైపు ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన దిగారు.

Also Read: వైసీపీ టీడీపీ దొందూ దొందే…. ఇవే సాక్ష్యాలు….?

తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే అంతర్వేది రథం దగ్ధం రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏపీ వ్యాప్తంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు కలవరపరుస్తున్నాయి.

అంతర్వేది రథం దగ్ధం ఘటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. మరో ఘటన అదే తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది.