Government of Odisha : పార్లమెంట్ చివరి దశ ఎన్నికలు జూన్ 1న జరుగనున్నాయి. చివరి దశ పోలింగ్ కు ముందు ఈసీ ఒడిశా సీఎం విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డీఎస్ కుటేపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్య తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో అనవసర జోక్యంపై ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషన్ వెళ్లడించింది. ఇదే సమయంలో మెడికల్ లీవ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఐజీ (సీఎం సెక్యూరిటీ)ని గురువారం (మే 30)లోగా మెడికల్ బోర్డు ఎదుట హాజరవ్వాలని ఈసీ సూచించింది.
ఐపీఎస్ 1997 బ్యాచ్ కు చెందిన డీఎస్ కుటే సీఎం ముఖ్యమంత్రి ఆఫీస్ లో అత్యంత శక్తివంతమైన బ్యూరోక్రాట్లో ఒకరిగా మారారు. ఢిల్లీలోని ఒడిశా రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో కుటే ప్రధాన కార్యాలయాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. గురువారంలోగా కుటేకి చార్జిషీటు జారీ చేయాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరింది. ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్-సీఈఓ) ముసాయిదా చార్జిషీట్ను ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నారు.
మరో ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఈ నెల (మే) 4వ తేదీ నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. దీనికి సంబంధించి గురువారం నాటికి వివరణాత్మక వైద్య పరీక్షల కోసం భువనేశ్వర్ ఎయిమ్స్ డైరెక్టర్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాలని ఒడిశా ఎన్నికల కమిషన్ తెలిపింది. వాస్తవానికి, కమిషన్ సిఫారసు మేరకు, ప్రభుత్వం ఏప్రిల్లో సింగ్ను సెంట్రల్ రేంజ్ ఐజీ పదవి నుంచి బదిలీ చేసింది. ఎన్నికల సంఘం సిఫారసులతో ఏప్రిల్లో ఆరుగురు ఐపీఎస్లు, ఇద్దరు ఐఏఎస్లను బదిలీ చేశారు.
ఒడిశాలోని 6 లోక్సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు
లోక్సభ ఎన్నికల చివరి దశలో ఒడిశాలోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సారి అధికారం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రాబోతోందని, బీజేడీ నిష్క్రమణ తప్పదని ప్రధాని నుంచి పార్టీ సీనియర్ నేతల వరకు చెప్తూనే ఉన్నారు. అదే సమయంలో మరోసారి బీజేడీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సారి ఒడిశాలో బీజేపీ, బీజేడీ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.