Homeఎంటర్టైన్మెంట్చిక్కుల్లో సింగర్ మంగ్లీ .. ఏంటీ ఈ వివాదం?

చిక్కుల్లో సింగర్ మంగ్లీ .. ఏంటీ ఈ వివాదం?

Singer Mangli bonalu song 2021ప్రముఖ గాయని సత్యవతి అలియాస్ మంగ్లీపై మరో వివాదం చోటుచేసుకుంది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంలో మంగ్లీ పాడిన పాటపై కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది. ఈ పాటలో వాడిన పదాలపై ప్రసార మాధ్యమాల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆందోళన చేయడంతో బీజేపీ కూడా కల్పించుకుంది. దీంతో వివాదం మరింత ముదురుతోంది. దీనిపై మంగ్లీ తొలిసారి స్పందించారు. తెలంగాణ పండుగలు అంటే తనకు కూడా ఇష్టమేనని చెప్పారు. దేవతల గురించి పాడానని తేల్చిరు.

బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుచెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్ల బృందం మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మంగ్లీ పాటను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇక పాట రచయిత గురించి చెబుతూ ఆయనో ఓ 80 ఏళ్ల వృద్ధుడు అని చెప్పారు. పేరు రామస్వామి అని చెప్పుకొచ్చారు. ఆయన తన పదాల పొందికలో ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఉద్దేశంతోనే పాటలో మార్పులు చేయలేదని సూచించారు.

పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. 2008లో ఈ పాటను డీఆర్సీ ఆడియో సంస్థ వారు సీడీ రూపంలో విడుదల చేశారన్నారు. జానపదాలు తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనపై ఉన్న అభిమానంతోనే పాటలో మార్పులు చేయలేదని చెప్పారు. 300 జానపదాలతో పాటు గ్రామ దేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారన్నారు. చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ అని సాగే ఈ పాటలో మెతెవరి అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. అయితే రచయిత అభిప్రాయంలో మెతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే పదంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదంపై వాదనలు జరుగుతున్నాయి.

తాను గిరిజన జాతికి చెందిన దానినేనని అన్నారు. బతుకమ్మ బోనాల పండుగల్లాగే మా బంజారాల్లో తీజ్, శీతల్ పండుగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తామన్నారు. గ్రామ దేవతలను కొలుస్తామని చెప్పారు. అమ్మవారి కృపతోనే తాను గాయకురాలిగా ఎదిగానని పేర్కొన్నారు. అమ్మవారి దీవెన, ఆంజనేయ స్వామి కృపతోనే ఇంతటి దాన్ని అయ్యానని వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని అన్నారు. దేవతల కోసమే పాడాను కాని వారి పట్ల తనకు ఎలాంటి దురభిప్రాయాలు లేవని పేర్కొన్నారు.

నా జాతి, కులం, ప్రాంతపై రకరకాల కామెంట్లు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో పాటను మార్చాలని అనుకున్నా రచయిత రామస్వామిని తక్కువ చేయకూడదనే మార్చలేకపోయామని తెలిపారు. దీన్ని మరింత పెద్దది చేస్తూ కించపరచాలని చూస్తూ వక్రమార్గాలు అనుసరించడం సరైంది కాదని సూచించారు. రచయిత కుటుంబసభ్యుల అనుమతితో పాటలో మార్పులు చేశామని గాయని మంగ్లీ తన అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version