Homeజాతీయ వార్తలుమరో సీనియర్ జర్నలిస్టును బలిగొన్న కరోనా

మరో సీనియర్ జర్నలిస్టును బలిగొన్న కరోనా

 

తెలంగాణలో కరోనా వైరస్ మరో జర్నలిస్టును బలితీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ “మా హైదరాబాద్” వెబ్ ఛానల్ సీఇఓ, సంపాదకుడు శ్రీధర్ ధర్మాసనం కోవిడ్ తో గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు ఝామున మరణించారు. పదిరోజుల క్రితం ఆయన కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు.

శ్రీధర్ ధర్మాసనం కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. 1965 ఏప్రిల్ 23న శ్రీధర్ జన్మించారు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగింది. జగ్జీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం పూర్తి చేశారు. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్ లో పనిచేస్తూ టెలిమీడియా ఆన్ టీవీ మీడియా సంస్థను 1992లో స్థాపించాడు.

తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీధర్ చురుకుగా పాల్గొన్నారు. ఆన్ లైన్ జర్నలిస్టులకు ఓ యూనియన్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలకు చెందిన పలు చిత్రాలను రూపొందించారు. పాత్రికేయునిగా, నిర్మాత దర్శకునిగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా “ ఇండి వుడ్” జీవన సాఫల్య సత్కారం తో సహా అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు .

టెలివిజన్ నిర్మాతల మండలి (టి వి పి సి ) వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. శ్రీధర్ కు భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు. బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్తియలు బుధవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన తమ్ముడు భరత్ తెలిపారు.

శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల టెలివిజన్ నిర్మాతల మండలి తీవ్ర విషాదం వ్యక్తం చేసింది. ఓక ఆత్మీయుణ్ణి కోల్పోయామని
టివిపిసి అధ్యక్ష్యుడు షరీఫ్ పేర్కొన్నారు. శ్రీధర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టివిపిసి ముఖ్యులు ఎల్. త్రినాథ రావు, పి.వి. రామ మోహన్ నాయుడు, వల్లభనేని మహీధర్, సత్యం బాబు, నల్లూరి సుధీర్ కుమార్, గుణవర్ధన్ తదితరులు కూడా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..

ఇక శ్రీధర్ మృతి పట్ల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper
Exit mobile version