Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Radha- Paritala Sriram: పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, బాలయోగి తనయుడి భేటీ సీక్రెట్...

Vangaveeti Radha- Paritala Sriram: పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, బాలయోగి తనయుడి భేటీ సీక్రెట్ అజెండా అదేనా?

Vangaveeti Radha- Paritala Sriram: ఏపీలో ఎన్నికల ఫీవర్ ముందుగానే వచ్చేసింది. ముందస్తా.. లేకుంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నదానిపై స్పష్టత లేకున్నా అన్ని పార్టీలూ రేపే ఎన్నికలన్నట్టు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కీలకం. ఫలితాలు తారుమారైతే ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదముంది. అందుకే చంద్రబాు ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. అందులో భాగంగా యువ జపం పఠిస్తున్నారు. 40 శాతం యువతకే టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. అటు పార్టీలో సీనియర్ల వారసులను బరిలో దించేందుకు నిర్ణయించారు. అటు వైసీపీలో మాత్రం వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చిచెప్పారు. టీడీపీలో మాత్రం యువ సందడి అధికంగా ఉంది. ఇటువంటి తరుణంలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్, బాలయోగి కుమారుడు హరీష్ కలిసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Vangaveeti Radha- Paritala Sriram
Vangaveeti Radha- Paritala Sriram

వంగవీటి, పరిటాల పేర్లకు వైబ్రేషన్ ఉంది. తెలుగునాట ఈ రెండు బలమైన నేపథ్యమున్న రాజకీయ కుటుంబాలు. ఆ కుటుంబ వారసులు ఒక చోట కలిశారంటే అది కచ్చితంగా రాజకీయాల కోసమేనని టక్ నడుస్తోంది. ఈ ముగ్గురు యువనేతలు రాజమండ్రిలో కలిశారు. ప్రస్తుతం రాధా, శ్రీరామ్ , హరీష్ లు టీడీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు కీ రోల్ పోషించాలనుకున్నారు. అటు సామాజిక కోణంలోనే వచ్చే ఎన్నికలు జరగనున్నందున సామాజికవర్గ ఓట్లు రాబెట్టుకునేందుకు చంద్రబాబు వీరి సేవలను వినియోగించుకోనున్నారు. సామాజికవర్గపరంగా ఫుల్ మాస్ యూత్ లీడర్లుగా ఉండడంతో వీరి సేవలకు అక్కరకు వస్తాయని అధినేత ముందుగానే గ్రహించారు. గెలుపోటములతో సంబంధం లేకుంటే రాష్ట్రంలో వీరిని అభిమానించే వారు లక్షలాది మంది ఉంటారు. అటువంటి వారిని టీడీపీ వైపు నిలిచేలా ప్లాన్ లో భాగంగానే ముగ్గురు కలిశారని తెలుస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

Vangaveeti Radha- Paritala Sriram
Vangaveeti Radha- Paritala Sriram

గతంలో వంగవీటి రాధాపై హత్యకు రెక్కీ నిర్వహించారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాధాకు సంఘీభావం తెలిపాయి. చంద్రబాబు నేరుగా వచ్చి రాధాతో చర్చించారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ స్పీడుగా స్పందించారు. రాధాకు అండగా నిలబడ్డారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేతలను సమన్వయం చేసే బాధ్యతలను చంద్రబాబు వారిద్దరికి అప్పగించారు. మరోవైపు త్వరలో లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో వీరి సేవలను ఏపీ వ్యాప్తంగా వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే రాధా, శ్రీరామ్ లు యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version