Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం

Schools Reopenకొవిడ్ ప్రభావంతో పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 16నుంచి పాఠశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. దీంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఒక పక్క మూడో దశ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పాఠశాలల ప్రారంభానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు లోపు విద్యాసంస్థల్లోనాడు నేడు పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉఫాధ్యాయులకు శిక్షణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సుేష్ తెలిపారు.
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందన్నారు. దీంతో పాఠశాలలు మూతపడవని వివరించారు. ఉపాధ్యాయుల పోస్టులు తగ్గవని సూచించారు. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మిస్తామన్నారు.
ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు కలుపుతామన్నారు. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యాసంవత్సరం జాప్యం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version