Homeజాతీయ వార్తలుSanjiv Khanna: సుప్రీం కోర్టు కొత్త సీజేగా సంజీవ్‌ఖన్నా.. ఆయన నేపథ్యం.. తెలుసా?

Sanjiv Khanna: సుప్రీం కోర్టు కొత్త సీజేగా సంజీవ్‌ఖన్నా.. ఆయన నేపథ్యం.. తెలుసా?

Sanjiv Khanna: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ఈ న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. దేశంలోని అన్ని కోర్టులకు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు, కేంద్రం సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ఖన్నాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్‌ 11న ఆయన బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నవంబర్‌ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నూతన సీజేఐని నియమించారు. సంజీవ్‌ ఖన్నా 1960, మే 14న జని‍్మంచారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. తిసాహజాఈ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులు వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు.

2005లో న్యాయమూర్తిగా..
ఇక సంజీవ్‌ఖన్నా 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయా‍్యర. తర్వాత ఏడాదికే శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయా‍్యరు. 2019 జనవరి 18న సుప్రీంకోరు‍్ట న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూరితగా పనిచేయకుండానే నేరుగా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఘనత సాధించిన కొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. ఇక సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ఆర్‌.ఖన్నాకు ఆయన మేనలు‍్లడు. ఇక 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించిన సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌ఆర్‌ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఊడా సస్పెండ్‌ చేయవచ్చంటూ 1976లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వలువరించిన తీరు‍్పతో విభేదించిన ఏకైక సభ్యుడిగా ప్రసిద్ధుడు. ఈ కారణంగానే ఆయనను సీజేఐ పదవి వరించలేదు.

సంజీవ్‌ ఖన్నా చరిత్రాత్మక తీర్పులు
ఇదిలా ఉంటే.. జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా న్యాయ కోవిదునిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌కు చెక్‌ పెడతాయని స్పష్టం చేయడమే కాకుండా ఎన్నికల్లో వాడడాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. వీవీ పా‍్యట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరుశాతం వెరిఫై చేయాలని దాఖలైన కేసును కొట్టివేసిన ఆ ధర్మాసనానికి సంజీవ్‌ఖన్నా సారథి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు నా‍్యయమూర్తుల రాజా‍్యంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఖన్నా సభ్యుడు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో కూడా ఖన్నా సభ్యుడు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఢిలీ‍్ల మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం చేసుకునేలా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version