ఆంధ్రప్రదేశ్‌Minister Dharmana Prasada Rao: సర్కారు సొమ్ముతో మంత్రి ధర్మాన స్థలానికి రహదారి

Minister Dharmana Prasada Rao: సర్కారు సొమ్ముతో మంత్రి ధర్మాన స్థలానికి రహదారి

Minister Dharmana Prasada Rao: విశాఖ నగరంలో శివారు కాలనీల ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సరైన రహదారులు లేక అసౌకర్యానికి గురవుతున్నారు. మా కాలనీకి రహదారి నిర్మించండి మహాప్రభో అంటూ జీవీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వారు పెడచెవిన పెడుతున్నారు. కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చెందిన భూమి కోసం ఏకంగా 60 అడుగుల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా 16 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులు వెచ్చించి రోడ్డు నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఉందని చెబుతూ.. ఆ భూమి వెలువ పెరిగేలా రోడ్డు పనులు చేపడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మధురవాడ సర్వేనెంబర్ 187 /1 లో ధర్మాన ప్రసాదరావుకు 4.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మాజీ సైనికుడికి ప్రభుత్వం కేటాయించింది. అమ్మకానికి ఎన్ఓసి ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉండే సమయంలో సదరు మాజీ సైనికుడు భార్య దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో ఆగమేఘాలపై ఎన్ఓసీ జారీ చేయడం వెనుక ధర్మాన ప్రసాదరావు ఉన్నారన్న ప్రచారం సాగింది. అటు తరువాత అదే భూమిని ధర్మాన కుమారుడి కంపెనీ పేరిట కొనుగోలు చేయడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. ప్రభుత్వాలు మారిన తర్వాత అంతా సైలెంట్ అయ్యింది.

ఇప్పుడు అదే భూమి కోసం ఏకంగా 60 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడుతుండడం విశేషం. మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి సదరు స్థలం వరకు 60 గల రోడ్డు నిర్మాణాన్ని వీఎమ్ఆర్డిఏ అధికారులు మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు.మంత్రి ప్రోత్సాహంతో నే ఈ రహదారిని మాస్టర్ ప్లాన్లు ప్రతిపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు ఇక్కడ రహదారి అవసరమే లేదు. అయినా జీవీఎంసీ అధికారులు పట్టు పట్టి మరి రోడ్డు ఏర్పాటు చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికిగాను జీవీఎంసీ 16 లక్షల రూపాయలును కేటాయించింది.తుప్పల తొలగింపు, కచ్చా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రెండు మూడు రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కేవలం మంత్రి ధర్మాన భూమిని విలువ పెంచేందుకే జీవీఎంసీ అధికారులు పనులు చేపట్టారు అనే విమర్శలు విశాఖలో వ్యక్తం అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...