Homeజాతీయ వార్తలుRevanth Reddy: కేసీఆర్ అవినీతిపై అమిత్ షాకు ఆధారాలు అందచేస్తా.. రేవంత్ సంచలనం

Revanth Reddy: కేసీఆర్ అవినీతిపై అమిత్ షాకు ఆధారాలు అందచేస్తా.. రేవంత్ సంచలనం

Revanth Reddy:  తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. నిర్మల్ కు వస్తున్న అమిత్ షాకు వాటిని అందజేస్తామంటూ బాంబు పేల్చాడు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీద ఆధారాలతో సహా కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా కేంద్రం స్పందించడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ నేతలు బండి సంజయ్ మాట్లాడుతున్నారని..సెప్టెంబర్ 17న తెలంగాణ కు అమిత్ షా వస్తున్నారని.. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు , ఒక ఎమ్మెల్సీ లకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతి పై ఆధారాలు అందచేస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ ఇలా అనేక అవకతవకలపై ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధారాలు లేవంటున్నారు.. మాకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తే మేము అందజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నరేళ్లు అవుతోందని.. తెలంగాణ లో వ్యసనపరులకు స్వర్గదామంగా మారిందని ఆరోపించారు.

తెలంగాణలో విపరీతంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని.. బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక దాడులకు.. మద్యం మత్తులో చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలిందని.. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లో నేరాల లిస్ట్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రేవంత్ పేర్కొన్నారు. మద్యం , గంజాయి మత్తులో తెలంగాణ యువత చిక్కుకుంటోందన్నారు.

హైదరాబాద్ సింగరేణి ఘటనపై .. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడని చెప్పారని.. 5 రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. సీఎం కేసీఆర్ ను అడుగుతున్న.. ఆరేళ్ల పసిబాలలను చెరిపి చెంపేసే విష సంస్కృతి ని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు.?’ అని ప్రశ్నించారు.

సినీనటులు డ్రగ్స్ వాడుతున్నారని గతంలో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి.. విచారణ అధికారి అకున్ సభర్వాల్ ను పక్కకు తప్పించారని రేవంత్ ఆరోపించారు.
డ్రగ్స్ కేసులో నేను కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశానని తెలిపారు. ఈడీ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు లో పేర్కొంది. డ్రగ్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్ర లో తీగ లాగితే హైదరాబాద్ లింక్ లు బయటపడుతున్నాయని ఆరోపించారు.

హైదరాబాద్ లో సింగరేణి కాలనీ.. హోంమంత్రి మహమూద్ అలీ ఇంటికి కూతవేటు దూరంలో ఉందని.. సింగరేణి కాలనీలో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా సాగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి కాలనీని దత్తత తీసుకున్న కేటీఆర్ కు.. ఘోర ఘటన జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సీఎం ఎందుకు సమీక్ష చేయడం లేదని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version