Revanth Reddy: ఎక్సైజ్ శాఖ విచారణలో చాలా మందిని తప్పించారు.. రేవంత్ రెడ్డి

డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎక్పైజ్ శాఖ విచారణలో చాలా మందిని తప్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఎక్సైజ్ శాఖ తూతూ మంత్రంగా విచారణ జరిపిందని ఆయన అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ విషయంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో పేరున్న కార్పొరేట్ స్కూళ్లలోనూ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతన్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. విచారణ ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు […]

Written By: Suresh, Updated On : September 15, 2021 2:11 pm
Follow us on

డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎక్పైజ్ శాఖ విచారణలో చాలా మందిని తప్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఎక్సైజ్ శాఖ తూతూ మంత్రంగా విచారణ జరిపిందని ఆయన అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ విషయంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో పేరున్న కార్పొరేట్ స్కూళ్లలోనూ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతన్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. విచారణ ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు.