Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

Republic TV Arnab
రిపబ్లిక్ టీవీ దేశవ్యాప్తంగా పేరున్న వార్తా చానల్. దీన్ని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంచలన వార్తలకు కేంద్ర బిందువు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ న తయారు చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్ పై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నికావు.. అయితే భారతీయ జనతాపార్టీ పెద్దలకు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన ఆర్నాబ్.. దక్షిణాదిపై పెద్దగా దృష్టి పెట్టరు. టీడీపీ హయాంలో తిరుమల ఆయయం విషయంలో వివాదాస్పద కథనాలు ప్రసారం చేశారు. చాలా కాలం తరువాత మళ్లీ ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తూ.. కొన్ని కథనాలు ప్రసారం చేస్తున్నారు.

Also Read: అదంతా రాజకీయమేనా..? స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..

ఆర్థిక అవకతవకలు.. పార్టీలో తిరుగుబాటు అంటూ.. రకరకాలుగా చెబుతున్నారు. ఈ కథనాలు వైసీపీలోనూ గందరగోళాన్ని రేపుతున్నాయి. దీంతో సజ్జల లాంటివారు మీడియా ముందుకు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశాలను ఖండించాల్సి వస్తోంది. రిపబ్లిక్ టీవీకి బీజేపీ ఎంతో…. బీజేపీ మిత్రులు కూడా అంతే. వారి గురించి ప్రత్యేకంగా ఎక్కడా నెగెటివ్ కథనాలు ప్రసారం చేయదు. బీజేపీ మిత్రులుగా పేరున్న వైసీపీ విషయంలో కూడా రిపబ్లిక్ టీవీ మొన్నటివరకు సైలెంటుగానే ఉండేది. ఇప్పుడు అనూహ్యంగా.. వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోంది.

వ్యతిరేకం అంటే.. అషామాషి కాదు.. వైసీపీలో కంగారు పుట్టించేలా ఆ కథనాలు ఉంటున్నాయి. ఆర్థిక అవకతవకలపై విదేశీయులు ఫిర్యాదు చేశారంటూ.. రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఆ తరువాత తిరుగుబాటు అనే వార్తను చెప్పింది. ఈ కథనం ఎలా ఉందంటే.. ప్రభుత్వంలో పదవులు ఇచ్చి.. వారికి తెలియకుండా వారిపేరు ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నారని.. ఆ విషయం తెలిసినవారు తిరుగుబాటుకు దిగుతున్నారని పరోక్షంగా రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. వైసీపీ డిఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడగా మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించారు. ఆర్నాబ్ పై తిట్ల దండకం అందుకున్నారు.

Also Read: ఆ రెండు కార్పొరేష‌న్లపై సర్వత్రా ఉత్కంఠ.. అధికార, ప్రతిపక్షాలకు రెఫరెండం

ఒక్కసారిగా రిపబ్లిక్ టీవీ వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా మారిపోయిందో.. అని వైసీపీ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. వైసీపీని బీజేపీకి దూరంగా పెట్టాలనుకుంటుందా..? అన్న సందేశం ఓ వైపు వస్తోంది. మరోవైపు బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైనా మద్దతు కోరుతుందా..? అన్న అనుమానం వస్తోంది. అన్నింటినీ వేసినట్లు ఆర్నాబ్ పై టీడీపీ ముద్ర వేస్తే.. కామెడీ అవుతామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఉన్న మీడియా సలహాదారులతో పరిస్థితిని చక్కబెట్టాలని లేకపోతే.. రిపబ్లిక్ టీవీ కలకల వార్తలు కొనసాగుతూనే ఉంటాయని వైసీపీ నేతలు కంగారు పడిపోతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version