Renu Desai: పవన్ పై విమర్శలకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్

ఇటీవల సీఎం జగన్ పవన్ గురించి ప్రస్తావించారు. ప్రతి మూడేళ్లకు భార్యను మార్చేస్తుంటారని ఎద్దేవా చేశారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ సంబోధించి పవన్ ను టార్గెట్ చేసుకున్నారు.

Written By: Dharma, Updated On : October 30, 2023 11:49 am
Follow us on

Renu Desai: ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలకు నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనుంచి తన కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన రాజకీయాలు చేయాలని సూచించారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడారు. మెగా కుటుంబంతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. పవన్ పై పొలిటికల్ విమర్శలపై స్పందించారు. ఇప్పుడు అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

పవన్ పై రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ప్రస్తావిస్తుంటారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి పవన్ వైవాహిక జీవితం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో రేణు దేశాయ్ స్పందించడం విశేషం.” పవన్ పై రాజకీయ విమర్శలు చేయండి. వ్యక్తిగత జీవితంపై ఎందుకు మాట్లాడుతున్నారు. పైగా మా పిల్లల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి మాటలు మానుకోవాలి” అంటూ రేణు దేశాయ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల సీఎం జగన్ పవన్ గురించి ప్రస్తావించారు. ప్రతి మూడేళ్లకు భార్యను మార్చేస్తుంటారని ఎద్దేవా చేశారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ సంబోధించి పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. అయితే పవన్ వ్యక్తిగత జీవితం పై జగన్ మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. రాజకీయ వేదికలతో పాటు ప్రభుత్వ అధికారిక సభల్లో సైతం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలోనే రేణు దేశాయ్ స్పందించడం విశేషం. 2014, 2019 ఎన్నికల్లో మూడు పెళ్లిళ్లు గురించే మాట్లాడారని.. 2024 ఎన్నికల్లో సైతం అదే మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని.. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు చేసుకోవాలని హితవు పలికారు.

గత ఎన్నికలకు ముందు సైతం వైసీపీ నేతలు పవన్ మూడు పెళ్లిళ్లు పైనే ఆరోపణలు చేసేవారు. గతంలో రేణు దేశాయ్ ను సాక్షి హోస్ట్ గా పెట్టి సైతం కొన్ని రకాలుగా పవన్ పై వ్యతిరేకత రావాలని కార్యక్రమాలు రూపొందించారు. ఇప్పుడు అదే రేణు దేశాయ్ వైసిపి తో పాటు జగన్ చర్యలను తప్పుపడుతూ హెచ్చరిక జారీ చేయడం విశేషం. మరోవైపు తన పిల్లలను తరచూ బయటకు లాగుతుండడాన్ని ఆమె తప్పు పట్టారు. పవన్ పై రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు అకీరా కూడా కోపంతో రగిలిపోతుంటాడని చెప్పడం ద్వారా రేణు దేశాయ్ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలే పంపారు. మరి వైసీపీ నేతలు ఇప్పటికైనా పవన్ పై వ్యక్తిగత దాడి తగ్గిస్తారో? లేదో? చూడాలి.