Homeఆంధ్రప్రదేశ్‌జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు...కారణం?

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

Pawan Kalyan Silence
జగన్ ఎడ్డెమ్ అంటే తెడ్డం అంటారు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా జగన్ నే భావించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున పోరడతాం అని చెప్పిన పవన్, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉన్నాడు. వీలైతే కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తూ పవన్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐతే జగన్ పట్ల ఆయన వైఖరి అలా ఉండదు. దూకుడు స్వభావం, పరుష వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు. జగన్ తీరు మారి…తన పాలనపై నమ్మకం కుదిరే వరకు జగన్ రెడ్డి అని మాత్రమే అని పిలుస్తాను అని చెప్పి పవన్ తన వ్యతిరేకత తెలియజేశారు.

కారణం ఏమిటో తెలియదు కానీ గతకొంత కాలంగా పవన్ జగన్ పై విమర్శల దాడి తగ్గించారు. ఈ మధ్య జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన పల్లెత్తి మాటనలేదు. రాజకీయ నాయకుల అరెస్టులపై టీడీపీ నానా యాగీ చేస్తున్నా, పవన్ మాత్రం నోరుమెదపలేదు. గతంలో టీడీపీ చేసే ప్రతి విమర్శకు పవన్ కూడా వంతపాడే వారు కాగా, అది ఇప్పుడు కనిపించడం లేదు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ హై కోర్ట్ నుండి స్టే తీసుకువచ్చి నిలిపివేసింది. దీనిపై అటు జగన్ ప్రభుత్వం గురించి కానీ ఇటు టీడీపీ విమర్శలపై కానీ పవన్ తన స్టాండ్ ఏమిటో వ్యక్తపరచలేదు. టీడీపీ రోజుకొక విమర్శతో సోషల్ మీడియా వేదికగా నానా యాగీ చేస్తున్నా, పవన్ ఇదివరలా మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇటీవల అమరావతి ఉద్యమం 200రోజులు పూర్తి చేసుకోగా పవన్ సోషల్ మీడియాలో కేవలం ఒక లెటర్ లో రైతుల అభిప్రాయాలను గౌరవించాలని, వారికి రావలసిన పరిహారం చెల్లించాలని నివేదన పూర్వకంగా వ్యవహరించారు. ఒకప్పుడు ఆయన రాజధానిని ఒక అంగుళం కూడా కదిలించలేరు..నేను ఉన్నాననని శబధం చేసిన తెలిసిందే.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

ఒంటరిగా ఉన్నప్పుడు దూకుడు చూపిన పవన్ అధికార పార్టీ బీజేపీ అండ ఉంచుకొని సైలెంట్ ఎందుకయ్యాడనేది, ఎవరికీ అర్థం కావడం లేదు. విమర్శించకపోగా కొత్త అంబులెన్సుల కొనుగోళ్లు, కరోనా నిర్వహణలో భేష్ అంటూ జగన్ ని పొగడం కూడా చూశాం. అకస్మాత్తుగా పవన్ లో మొదలైన ఈ పరివర్తనకు కారణం ఏమిటో అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి తగ్గించారా లేక ఇదే వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శల దాడి తగ్గించిన వేళ…ఆంధ్రా బీజేపీ నాయకులు విమర్శల జోరు పెంచడం విశేషం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version