Ratan Tata : విషమించిన రతన్ టాటా ఆరోగ్యం.. ఆస్పత్రిలో ఐసీయూలో చేరిక

అర్ధరాత్రి 12:30 గంటల మధ్య రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. రక్తపోటు విపరీతంగా పడిపోవడంతో.. వెంటనే ఐసీయూకి తరలించి.. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుక్ ఆస్పీ గోల్వాలా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

Written By: Mahi, Updated On : October 7, 2024 3:29 pm

Ratan Tata

Follow us on

Ratan Tata : దేశంలో అత్యంత విజయవంతమైన పారిశ్రామిక వేత్తల్లో రతన్ టాటా ఒకరు. మంచి మనసు, వినూత్న ఆలోచనలు, సాధారణ జీవన శైలితో ఆయన ప్రజల మనసుల్లో అత్యున్నతంగా ఉన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రతన్ టాటా వయసు 86ఏళ్లు. ఈరోజు ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషయంగా ఉండడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చినట్లు సమాచారం. కాగా, అర్ధరాత్రి 12:30 గంటల మధ్య రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. రక్తపోటు విపరీతంగా పడిపోవడంతో.. వెంటనే ఐసీయూకి తరలించి.. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుక్ ఆస్పీ గోల్వాలా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రతన్ టాటా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైద్య బృందం తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్‌పై ఆయనే స్వయంగా సమాచారం ఇచ్చారు.

అసలు కథ 1962లో మొదలైంది
1937 డిసెంబరు 28న ఇప్పుడు ముంబైని అప్పట్లో బొంబాయి అని పిలిచేవారు. రతన్ టాటా అక్కడే పుట్టారు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా మునిమనవడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నారుఅతను 1990 నుండి 2012 వరకు గ్రూప్ ఛైర్మన్‌గా.. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూపు ఛారిటబుల్ ట్రస్టులకు రతన్ టాటా అధిపతిగా కొనసాగుతున్నారు.
1962లో టాటా గ్రూప్‌లో చేరినప్పుడే రతన్ టాటా అసలు కథ మొదలైంది. 1990లో గ్రూప్ ఛైర్మన్ కాకముందు వివిధ పదవులు నిర్వహించి క్రమంగా వ్యాపార మెట్లు ఎక్కారు. అతని పదవీ కాలంలో, టాటా గ్రూప్ దేశీయంగా, విదేశాలలో గణనీయమైన వృద్ధిని, విస్తరణను సాధించింది. టాటా దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలు కంపెనీని టెలికాం, రిటైల్, ఆటో వంటి కొత్త పరిశ్రమలలోకి విస్తరించడానికి అనుమతించాయి.

ప్రభుత్వ గౌరవం
టాటా అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం. ఇది టాటా గ్రూప్ చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణం. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల ఆయన అంకితభావం కారణంగా భారతదేశం రెండు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సహా లెక్కలేనన్ని గౌరవాలను సంపాదించిపెట్టాయి.

టాటా సంపద
2024 నాటికి రతన్ టాటా మొత్తం సంపద 1.5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.12,483 కోట్లుగా అంచనా వేయబడింది. 2022 సంవత్సరంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. రతన్ టాటా మొత్తం సంపద రూ.3,800 కోట్లు. అతను తన సంపాదనలో 66 శాతం విరాళంగా ఇస్తున్నారు. ఆయన తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని టాటా ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం రతన్ టాటా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్‌లో తన 5శాతం వాటాను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. 86 ఏళ్ల రతన్ టాటా 2016లో ఈ సంస్థలో 1.33శాతం వాటాను కొనుగోలు చేశారు. తన పెట్టుబడిలో అతను ఇప్పుడు 5శాతం వాటాను మాత్రమే విక్రయించారు. మిగిలిన 95శాతం ఆయనే కలిగి ఉన్నారు. కంపెనీలో రతన్ టాటాకు చెందిన 5శాతం వాటాల బైబ్యాక్ ప్రక్రియ పూర్తయినట్లు అప్‌స్టాక్స్ ఇటీవల ప్రకటించింది. ఈ వాటా విక్రయంతో రతన్ టాటా తన 2016 పెట్టుబడిపై 23,000శాతం రాబడిని అందుకున్నారు. ఈ రాబడి కంపెనీ ప్రస్తుత విలువ 3.5 బిలియన్ డాలర్ల ఆధారంగా ఉంటుంది.

రతన్ టాటా వారసుడు
రతన్ టాటా కంపెనీ నుంచి కార్లను తయారు చేయడమే కాకుండా అందరికి చేరువవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందుకే టాటా కూడా ఉప్పుతో సహా అనేక నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. అవి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఫిబ్రవరి 2017లో రతన్ టాటా తర్వాత నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2016లో సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన రతన్ టాటా తిరిగి బాధ్యతలు చేపట్టారు. రతన్ టాటా మేనకోడలు మాయా రతన్ టాటా వారసురాలిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.