
తెలుగు రాష్ట్రాల్లో పప్పు అంటూ టీడీపీ అధినేత కుమారుడే గుర్తొస్తాడని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుంటారు. అదే కేంద్రంలో తీసుకుంటే ఆ సార్థక నామదేయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కుతుందని రాజకీయాల్లో ప్రచారం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీని మరింత అవమానించేలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ అపరిపక్వత వల్ల చాలా సార్లు అవమానాల పాలయ్యాడు. పార్లమెంట్ లో మోడీని కౌగిలించుకొని కన్నుకొట్టడం.. పలు ప్రసంగాల్లో నవ్వుల పాలవ్వడం చూస్తూనే ఉన్నాం.. కానీ ఇప్పుడు మెచ్చుర్డ్ గా ఆలోచిస్తున్నారు. ఇటీవల వలస కార్మికులను ఇళ్లకు సొంత ఖర్చుతో పంపి అందరి మనసులు చూరగొన్నారు.
దేశమంతా గమనించే రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా జాతీయ నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలా మర్పు కనిపిస్తోంది.
తాజాగా రాహుల్ గాంధీ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. లాక్ డౌన్ వేళ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ మరణానికి దేశమంతా నివాళులర్పిస్తోంది. మంచి భవిష్యత్ ఉన్న అతడి అర్ధాంతరంగా చనిపోవడంపై కన్నీళ్లు కారుస్తున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ లో తాజాగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి, ఫ్యాన్స్ కు సానుభూతి తెలిపారు.
కానీ కొందరు నెటిజన్లు రాహుల్ ట్వీట్ ను మార్చేశారు. మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని అవమానించేలా వదిలారు.
తాజాగా రాహుల్ గాంధీ పేరిట వైరల్ అవుతున్న ఆ ట్వీట్ నకిలీదని తేలింది. రాహుల్ ను అవమానించేలా కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలగా పాపం దానికి రాహుల్ బుక్కయ్యాడు. రాహుల్ ట్విట్టర్ లో యాక్టర్ అనే ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం క్రికెటర్ అని ఉండడంతో రాహుల్ ను అభాసుపాలు చేయడానికి కొందరు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.
యాక్టర్ ను క్రికెటర్ గా మార్చి రాహుల్ గాంధీ ట్వీట్ ను వైరల్ చేసి.. ఆయనకు నటుడికి, క్రికెటర్ కు తేడా తెలియదా అని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ చేసిన ట్వీట్ నిజమైనదే కావడంతో ఇదంతా రాహుల్ ను డ్యామేజ్ చేసే కుట్రగా అభివర్ణిస్తున్నారు.
I am sorry to hear about the passing of #SushantSinghRajput. A young & talented actor, gone too soon. My condolences to his family, friends & fans across the world.
— Rahul Gandhi (@RahulGandhi) June 14, 2020