spot_img
Homeజాతీయ వార్తలుకరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి... ఏం జరిగిందంటే...?

కరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి… ఏం జరిగిందంటే…?

మనలో చాలామంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని రోజుల పాటు ఉండాలంటే సముఖత చూపరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగానే అందినా అక్కడ మౌలిక సౌకర్యాలు బాగా ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆస్పత్రుల పరిశీలనకు వచ్చిన రాజకీయనాయకులు సైతం రోగులు ఇలాంటి సమస్యలు చెబితే పెద్దగా పట్టించుకోరు.

అయితే పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం కరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్డి శుభ్రం చేసి ప్రశంసలు అందుకున్నారు. దగ్గర్లో ఎన్నికలు లేకపోయినా రోగులు సమస్య చెప్పిన వెంటనే స్వయంగా పరిష్కరించి నిజమైన లీడర్ అనిపించుకున్నారు. పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో నిన్న కృష్ణారావు పర్యటించారు. అక్కడ బాధితులను పరామర్శించి వసతులు, ఇతర విషయాల గురించి ఆరా తీశారు.

ఆ సమయంలో ఆస్పత్రిలో టాయిలెట్స్ ను సరిగ్గా శుభ్రపరచటం లేదని కొందరు రోగులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి రంగంలోకి దిగి టాయిలెట్స్ శుభ్రం చేసి రోగులు మరోసారి ఫిర్యాదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని సున్నితంగా మందలించారు. కరోనా బాధితులు మరుగుదొడ్లు వినియోగించిన తరువాత నీళ్లతో శుభ్రం చేయాలని సూచించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్మికులను 458 మందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version