వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు.
కరోనాకు సంబంధించిన, రాష్ట్రానికి కేంద్ర సాయం, గతంలో ప్రస్తావించిన ఎఫ్ఆర్బీఎంకు మరింత వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాల నుంచి ప్రయాణికుల తరలింపు, ప్రవాసుల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.
రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని మోడిని కోరారు. రైళ్లను ఇప్పుడప్పుడే పునరుద్దరించవచ్దని కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంంచాలన్నారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు అనుమతించాలని కోరారు. కరోనాతో కలసి సహజీవనం చేయాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కంటెయిన్ మెంట్ జోన్ లో ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం స్పందించాలని కేసీఆర్ కోరారు. కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలియదన్నారు. ప్రధాని మోడితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పై సూచనలు చేశారు.