spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan On Visakha: విశాఖ నుంచి జగన్ పాలన.. ఆపేందుకు సుప్రీంలో పిటీషన్

Jagan On Visakha: విశాఖ నుంచి జగన్ పాలన.. ఆపేందుకు సుప్రీంలో పిటీషన్

Jagan On Visakha: విశాఖ నుంచి పాలన అంటూ సీఎం జగన్ హడావిడి చేస్తున్నారు. విజయదశమిని ముహూర్తం గా పెట్టుకున్నారు. ప్రభుత్వ శాఖల గురించి కార్యాలయాలను అన్వేషించాలని ఆదేశాలు ఇచ్చారు. ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ భవనాల అన్వేషణలో పడింది. మరోవైపు సీఎం క్యాంప్ కార్యాలయంగా భావిస్తున్న రిషికొండలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో జగన్ కు షాకింగ్ కలిగించే విషయం. రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణంఫై సుప్రీంకోర్టులో రిప్ పిటిషన్ దాఖలయింది.

లింగమనేని శివరాం ప్రసాద్ అనే పర్యావరణ వేత్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా క్యాంపు కార్యాలయం నిర్మించారని పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు విచారణ జరుగుతుండగా.. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో జగన్ విశాఖ నుంచి పాలన ప్రశ్నార్ధకంగా మిగలనుంది.

అయితే ఇప్పటివరకు రిషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయములో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. అవి సీఎం క్యాంప్ ఆఫీసు కోసమే చేపడుతున్న నిర్మాణాలే అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కోర్టుల్లో కేసులు ఉండడం వల్లే అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం మడత పేచీ వేసే అవకాశం ఉన్నందున పిటీషనర్ ముందస్తు ఆలోచన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పై జిఏడి ఇచ్చిన జీవో, పలు పత్రికల్లో వచ్చిన వార్తలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. గతంలో రిషికొండ నిర్మాణాలపై జస్టిస్ బి ఆర్ గవాయి నేతృత్వంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జత చేశారు.

ఇప్పటికే రిషి కొండపై నిర్మాణాలను పూర్తి చేశారు. ఇందుకుగాను భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇంజనీర్లను పక్కనపెట్టి మరీ.. ప్రైవేటు ఆర్కిటెక్చర్లను తెచ్చి మరీ కీలక నిర్మాణాలు జరిపారు. ఇప్పటి వరకు 270 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ప్రతికూల ఆదేశాలు ఇస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రిషికొండలో పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారు. పర్యాటక నిర్మాణాల మాటున కొండను తవ్వేశారు. ఇప్పుడు గానీ వ్యతిరేక తీర్పు వస్తే ఏమిటన్న ప్రశ్న అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఎక్కడ తమను బాధ్యులను చేస్తారో అన్న ఆందోళన కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...

Chiranjeevi: చిరంజీవికి కూటమి కీలక బాధ్యతలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది....

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Oktelugu Epaper
Exit mobile version