ఏపీలో చంద్రబాబుకు స్థానం లేదు!

ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారని, ఆయనకు ఎపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 అసెంబ్లీ, 3 ఎంపి స్థానాలు వచ్చాయని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవి కూడా రావని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వుండదన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని, హైదరాబాద్ లోని […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 1:30 pm
Follow us on


ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారని, ఆయనకు ఎపి రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో పొరపాటుగా టిడిపికి 23 అసెంబ్లీ, 3 ఎంపి స్థానాలు వచ్చాయని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు పార్టీకి ఇకపై అవి కూడా రావని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వుండదన్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని, హైదరాబాద్ లోని ఇంటిలో కూర్చుని బయటకు రాకుండా బాబు మాట్లాడుతున్నాడని చెప్పారు.

కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేత కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రతిపక్ష నేతగా జవాబు చెప్పాలన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న పనులకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

కానీ రాష్ట్రప్రభుత్వం చేసే ప్రతి పనిని బాబు బూతద్దంలో తప్పుగా చూస్తు విమర్శలు చేస్తున్నాడని తెలిపారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా కరోనా సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

కోవిడ్ నేపథ్యంలో కేవలం నాలుగు వారాల్లో తొమ్మిది ల్యాబ్ లను ఏర్పాటు చేశామని, దేశంలో సగటు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్ లు చేస్తున్నాట్లు చెప్పారు. కోవిడ్ అనుమానిత వైద్య పరీక్షలు చేయడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 7,900 మంది క్వారంటైన్ లో వున్నారని, వారికి అన్ని వసతులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం టెలిమెడిసిన్ ను ప్రారంభించారని తెలిపారు. 14400 నెంబర్ కు మిస్ట్ కాల్ చేస్తే చాలు వైద్యులు వైద్య సహాయం కోసం అందుబాటులోకి వస్తారన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 మందికి కోవిడ్ పరీక్షలు చేశామని,

ముఖ్యమంత్రి ముందుచూపుతో ఇతర దేశాల నుంచి ర్యాపిడ్ కిట్ లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారని తెలిపారు. చివరికి దీనిపైన కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాకులు, చెవాకులు మాట్లాడాడన్నారు. ఐసిఎంఆర్ అనుమతితో జరుగుతున్న పరీక్షలపైన కూడా విమర్శలు చేయడం దారుణమని, రాష్ట్ర ప్రజలకు వరప్రదాయినిగా ర్యాపిడ్ టెస్ట్ లతో కోవిడ్ ను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోందని చెప్పారు. చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయాలకు తావిస్తూ విమర్శలు చేస్తున్నాడని తెలిపారు.