ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Varahi Yatra: జగన్ పై పవన్ కి ఆ రేంజ్ లో కసి

Pawan Kalyan Varahi Yatra: జగన్ పై పవన్ కి ఆ రేంజ్ లో కసి

Pawan Kalyan Varahi Yatra: పవన్ విశాఖలో సౌండ్ చేస్తున్నారు. వైసిపి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ నేరుగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ను తాను ఏకవచనంతో సంబోధిస్తానని చెప్పి మరి.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖలో వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ పై ఆ స్థాయిలో కసి ఉందా అన్నట్టు ధ్వజమెత్తారు.

జగన్ నాయకుడు కాదని పవన్ అభివర్ణించారు. ఆయన ఒక వ్యాపారి అని,కమిషన్ ఏజెంట్ అని, ఒక్క మద్యం వ్యాపారం ద్వారానే 30 వేల కోట్ల రూపాయల సంపాదించాడని, ఇప్పుడు అదే డబ్బును పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని బలమైన ఆరోపణలు చేశారు. అయితే గత రెండు యాత్రలకు భిన్నంగా పవన్ మాట్లాడుతున్నారు. కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. తొలి రెండు విడత యాత్రలో వైసీపీ మంత్రులు, కీలక నేతలపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పైనే గురిపెట్టారు. ఈ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

వైసీపీ సర్కార్ పాలన రాజధానిగా విశాఖను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ విశాఖలో వైసీపీ సర్కార్ జరుపుతున్న దురాగతాలను, నాయకుల వైఫల్యాలను పవన్ ఎండగట్టారు.’ విశాఖలో భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ సంస్థల భూములను తనఖా పెట్టారు. వేల సంవత్సరాల నాటి ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేస్తున్నారు. రుషికొండను బోడి గుండు చేశారు’.. అంటూ పవన్ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. విశాఖ తనకు అనేకం ఇచ్చిందని.. ఇక్కడే తాను చాలా నేర్చుకున్నాను అని పవన్ గుర్తు చేసుకున్నారు.

జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరును పవన్ ఎండగట్టారు.ప్రజల్లో చైతన్యం తీసుకునే ప్రయత్నం చేశారు. జగన్ పై 36 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఈ నాలుగేళ్లలో చూపించాడని.. 2024 ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే పవన్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం నింపుతూనే… జగన్ను మరోసారి ఎన్నుకుంటే జరగబోయే పరిణామాలను వివరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరికలే జారీ చేస్తున్నారు. అయితే ఇది ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉండటంతో అధికార వైసీపీలో వణుకు ప్రారంభమైంది. అయితే పవన్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడంలో వైసీపీ నేతలు వైఫల్యం చెందుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version