spot_img
Homeజాతీయ వార్తలుకేసీఆర్ మళ్లీ ముందుకే.. సంచలనం ఖాయమేనా?

కేసీఆర్ మళ్లీ ముందుకే.. సంచలనం ఖాయమేనా?

Parties are getting ready for early assembly elections

తెలంగాణ సీఎం కేసీఆర్.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు సాగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు, ఆయా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. తాను పర్యటించిన నియోజకవర్గాల్లలో నేతల పనితీరు, టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

ఇప్పటివరకు 22 అసెంబ్లీ, 6 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సంజయ్ పాదయాత్ర జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ తరఫున ఉత్సాహంగా పని చేస్తున్నవారెవరన్న దానిపై ఆయన అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు విడతల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుండగా, మొదటి విడత అక్టోబరు 2న ముగియనుంది. పాదయాత్రలో భాగంగా అభ్యర్థుల ఎంపికపైకూడా కసరత్తు చేస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం ద్వారా మిగిలిన మూడు విడతల్లో యాత్రకు ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తారనే వ్యూహం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది.

పైగా అధికార టీఆర్ఎస్ నుంచి కొద్ది మంది మినహా ఎక్కువ మంది సిటింగ్ ఎమ్మెల్యేలే బరిలోకి దిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దీంతో ఆ రెండు పార్గీలకు దీటుగా ఎన్నికలకు సమాయత్తం కావాలంటే అభ్యర్థులకు తగినంత సమయం అవసరం అవుతుందని, అందుకు ఇప్పటినుంచే ఎంపిక ప్రక్రియను ప్రారంభించడం మంచిదని భావిస్తున్నారు.

అయితే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల నష్ఠం కూడా జరగవచ్చన్న అభిప్రాయాలున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా టికెట్ కోసం నేతల ఎటుంటి పోటీ లేని చోట్ట అభ్యర్థులను ప్రకటించాలని, మిగిలిన చోట్ల సంకేతాలను మాత్రమే ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేలున్న గోషామహల్,దుబ్బాకతోపాటు వికారాబాద్, ఆంధోల్, ఎల్లారెడ్డి, హుజూరాబాద్ వంటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలి నియోజకవర్గాలకు సంజయ్ పాదయాత్ర ద్వారానే అంచనాకు రానున్నట్లు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper